విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యార్థినిపై కామాంధుడి రేప్: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా అమీనాబాద్‌లో 8వ తరగతి విద్యార్థినిపై 31 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. నిందితుడిని మదీనావలీగా గుర్తించారు. ఈ ఘటనపై బాధితులు దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇదిలావుంటే, తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం ముల్లూరులో పురుగుల మందు తాగి ముగ్గురు యువతులు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముగ్గురినిన ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. యువతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Class 8 girl student raped in Visakhapatnam district

నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని శాంతినగర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు పెన్నా కాలువలో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. 9వ తరగతి చదువుతున్న పురుషోత్తం, మదన్మోహన్‌లు కాలువలో గల్లంతయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. భార్యపై అనుమానంతో ఓ భర్త కత్తితో నరికి చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు జిల్లాలోని విడవలూరు మండలం రామతీర్థంలో భార్యతో అనుమానంతో కత్తితో పొడిచి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
31 year old man sexually assaulted class 8 girl student in Visakhapatnam district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X