ఎమ్మెల్సీ అభ్యర్దులుగా ఆ ఇద్దరు - చంద్రబాబు అనూహ్య ఎంపిక..!
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఇద్దరు ఎమ్మెల్సీలు రామచంద్రయ్య..ఇక్బాల్ స్థానాలు భర్తీ చేసేందుకు ఎమ్మెల్యే కోటాలో ఈ ఎన్నిక జరగనుంది. శాసనసభలో కూటమికి 164 మంది సభ్యుల మద్దతు ఉంది. దీంతో..కొత్తగా ఎవరికి ఎమ్మెల్సీ స్థానాలు దక్కుతాయనే ఆసక్తి కనిపిస్తోంది. తాజాగా పవన్ తో చంద్రబాబు చర్చల తరువాత ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్దుల ఖరారు పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
నూతన ఎమ్మెల్సీలుగా
ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. ఎన్నికల సమయంలో పలువురు ముఖ్య నేతలకు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియ పైన కసరత్తు కొనసాగుతోంది. ప్రస్తుతం రెండు ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపిక జరుగుతోంది. ఇద్దరూ ఎమ్మెల్యే కోటా కావటంతో ఏకగ్రీవంగా కూటమి నుంచి ప్రతిపాదించిన అభ్యర్దులే విజయం సాధించటం లాంఛనంగా మారింది. ఈ క్రమంలో చంద్రబాబు ఈ రెండు స్థానాలకు ఇద్దరి పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ పేర్ల పైన పవన్ తోనూ చర్చ జరిగగిందని తెలుస్తోంది.

వర్మకు తొలి ఛాన్స్
పవన్ కు పిఠాపురం సీటు ఖరారు సమయంలో అక్కడ టీడీపీ ఇంఛార్జ్ గా ఉన్న వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీల నియమాకం అవకాశం రావటంతో తొలి ఛాన్స్ వర్మకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇదే అంశం పైన పవన్ సైతం మద్దతుగా నిలిచారు. పిఠాపురంలో వర్మ మద్దతుతోనే పవన్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. పవన్ గెలుపు కోసం పని చేసిన వర్మకు తొలి విడతలోనే ఎమ్మెల్సీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీంతో..వర్మ అభ్యర్దిత్వం దాదాపు ఖారారైంది.
చంద్రబాబు కసరత్తు
ఇక, రెండో స్థానం రాయలసీమ నుంచి ముస్లిం మైనార్టీ వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరే సమయంలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ కే మరోసారి అవకాశం ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనగా సమాచారం. ఇక్బాల్ అభ్యర్దిత్వం ఖరారు పైన పవన్, బీజేపీ నేతలతోనూ చంద్రబాబు చర్చించిన తరువాత తుది నిర్ణయం ప్రకటించనున్నారు. వైసీపీకి సంఖ్య బలం సభలో లేకపోవటంతో...కూటమి నుంచి పోటీలో నిలబడే ఇద్దరు అభ్యర్దులు ఏకగ్రీవంగా గెలవటం లాంఛనంగా మారుతోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications