జగన్ పై దాడితో రాష్ట్ర ప్రభుత్వానికేం సంబంధం...ధైర్యంగా ముందుకు వెళుతున్నాం:సిఎం చంద్రబాబు
Recommended Video

అమరావతి:విశాఖ ఎయిర్పోర్టులో ప్రతిపక్ష నేత మీద జరిగిన దాడి గురించి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. జగన్పై ఆయన అభిమాని దాడిని రాష్ట్రప్రభుత్వానికి ముడిపెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
అమరావతిలో సోమవారం సీఎం చంద్రబాబు నీరు -ప్రగతిపై టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి జరుగుతుందనే ఎన్డీఏలో చేరామని, రాష్ట్రాభివృద్ధి జరగలేదు కాబట్టే బయటకు వచ్చామని చెప్పారు. అధికారం అంటే రాజకీయం, పరిపాలన రెండూ ముడిపడివుంటాయని అన్నారు.

తాము కేంద్రంతో పొత్తు సాగించినంత కాలం రాష్ట్రంలో ఐటీ దాడులు లేవని..విడిపోయి బయటకొచ్చాక మెరుపుదాడులు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు విమర్శించారు. ప్రజల అభిప్రాయాల మేరకే ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. తన ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవటం ధర్మవిరుద్దమని సిఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.
సీబీఐలో చోటు చేసుకున్న పరిణామాలు దేశ ప్రతిష్టకే మచ్చ తెచ్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సహాయ నిరాకరణ, ప్రతి పక్షం అడ్డంకులు, కుట్రలను అధిగమిస్తున్నామని, మన స్వయంకృషితో అభివృద్ధి ఆగకుండా చూశామని ఆయన వివరించారు. వినూత్న ఆలోచనలతో సత్ఫలితాలు పొందుతున్నామన్నారు. నీరు-ప్రగతి, నరేగా కన్వర్జెన్స్ అందుకు ఉదాహరణ అని చెప్పారు.
కేంద్రం, ప్రతిపక్షాలు ఒక్కటై తమ ప్రభుత్వంపై మూకుమ్మడి కుట్రలకు పాల్పడుతున్నాయని...అయినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలులో స్వైన్ఫ్లూ తీవ్రత పెరుగుతున్ననేపథ్యంలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications