తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!
తిరుమలలో భక్తులు సీఎం చంద్రబాబుకు కీలక రిక్వెస్ట్ చేసారు. దీనికి వెంటనే చంద్రబాబు స్పందించారు. భక్తులకు హామీ ఇవ్వటంతో పాటుగా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. తిరుమల పర్యటనలో భాగంగా చంద్రబాబు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత తరిగొండ వెంగమాంబ సత్రంలో అన్నదానంలో పాల్గొన్నారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఒక్క రోజు కు పూర్తిగా అన్నదాన ఖర్చుకు అవసరమైన మొత్తం టీటీడీకి విరాళంగా అందించారు.
దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని మరింత తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు ఈ సందర్భంగా సీఎంను కోరారు. భక్తుల విజ్ఞప్తిపై స్పందించిన చంద్రబాబు, శ్రీవారి దర్శనాన్ని మరింత సులభతరం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియో గించబోతున్నామని వెల్లడించారు. టెక్నాలజీ సాయంతో క్యూ లైన్ల నిర్వహణను క్రమబద్ధీకరించి, భక్తులకు తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం కలిగేలా టీటీడీ చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. భక్తుల భద్రత, సౌకర్యాల పర్యవేక్షణ కోసం తిరుమలలో ఏర్పాటు చేసిన 'ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్' ప్రాధాన్యతను సీఎం వివరించారు. పారిశుద్ధ్యం నుంచి భద్రత వరకు ప్రతి అంశాన్ని ఈ వ్యవస్థ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు.

నాణ్యత పరిశీలన కొత్తగా అందుబాటులోకి లాబ్
ఆ తరువాత తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ ల్యాబ్ లో నీరు, ఆహారపదార్థాలు, ముడి సరకుల నాణ్యతపై పరీక్షలు చేయనున్నారు. 12 వేల చదరపు అడుగుల్లో రెండంతస్తుల్లో వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ లేబరేటరీ నిర్మాణం చేసారు. రూ.20 కోట్లతో అత్యంత ఆధునిక యంత్రాలతో కూడిన లేబొరేటరీ లో అత్యాధునిక సాంకేతికతకు అనుగుణంగా ఈ-టంగ్ (e-tongue), ఈ-నోస్ (e-nose) వ్యవస్థలతో పాటు, నీరు మరియు ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించే అధునాతన పరికరాలు ఉన్నాయి. శ్రీవారి ప్రసాదాల్లో వాడే నెయ్యి, పాలు, ఇతర పదార్థాల నాణ్యతను ఈ ల్యాబ్ ద్వారా కఠినంగా పరీక్షించి నాణ్యతను పెంచనున్నారు. అపవిత్రతలను గుర్తించేందుకు (parts per trillion స్థాయిలో) ఈ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఉపయోగపడుతుందని, టిటిడి (TTD) ఆహార సరఫరాలో పారదర్శకతను పెంచుతుందని అధికారులు వివరించారు. తిరుమలలో అందుతున్న సేవల గురించి చంద్రబాబు భక్తులను అడిగి తెలుసుకున్నారు.
-
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం!












Click it and Unblock the Notifications