రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే టార్గెట్ - సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయవాడలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ-2025 సదస్సులో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కు చెందిన ఇన్వెస్టోపియా సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (APEDB) సంయుక్తంగా నిర్వహించాయి.
రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులే టార్గెట్..
వచ్చే ఏడాదిలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించాలనే దిశగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా 15 రంగాల్లో ప్రత్యేక పెట్టుబడి పాలసీలను రూపొందించినట్టు సీఎం వెల్లడించారు. అలానే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల ప్రతీ ప్రతిపాదనను ప్రత్యక్షంగా సీఎంవో పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఏపీలో ఇప్పటికే పోర్టులు, ఎయిర్పోర్టులు, నీటి వనరులు, వ్యవసాయ బలం, మానవ వనరులు, డిజిటల్ టెక్నాలజీ వంటి అసెట్లున్నాయని వివరించారు.

ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే తొలి హైడ్రోజన్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఇది గ్రీన్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహించి, పర్యావరణాన్ని రక్షించే దిశగా కీలక అడుగు అవుతుందని వివరించారు.
గూగుల్ సంస్థ త్వరలో విశాఖపట్నంలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయనుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇది రాష్ట్రాన్ని డిజిటల్ హబ్గా మార్చే దిశగా కీలక అడుగుగా పేర్కొన్నారు. ఇదే దారిలో మరిన్ని ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వివరించారు.
UAE - APEDB అవగాహన ఒప్పందం..
ఈ సదస్సులో UAE ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు APEDB మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ద్వారా రెండు ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంధాలు, పెట్టుబడుల మార్పిడి మరింత బలోపేతం అవుతాయని సీఎం వివరించారు. 2024 జనవరిలో దావోస్ సదస్సులో UAE ప్రతినిధులను ఆహ్వానించిన తర్వాత, కేవలం ఆరు నెలల్లోనే ఈ సదస్సు జరగడం, రాష్ట్ర పాలనలో వేగం, నిబద్ధతకు నిదర్శనమని సీఎం అన్నారు. UAE ప్రతినిధులు కూడా 50 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారని వెల్లడించారు.
విదేశాల్లో పెట్టుబడుల కోసం వెళ్లే ప్రతీ ప్రభుత్వ ప్రతినిధి తన పర్యటన సమయంలో కనీసం 25 శాతం సమయాన్ని ఏపీ కోసం వినియోగించాలన్నదే తన విజ్ఞప్తి అని చెప్పారు. అంతర్జాతీయ మద్దతును సాధించేందుకు లండన్, దుబాయ్, సింగపూర్, న్యూయార్క్ వంటి నగరాల్లో ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.
విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు గారు దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, సంస్థల సీఈవోలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోనే బలమైన ఆర్థికశక్తిగా భారత్ ఎదుగుతోందని, ఏపీ దేశంలోనే అన్నిరంగాల్లో నెంబర్ వన్గా నిలపాలనే లక్ష్యంతో ప… pic.twitter.com/fW2OFOOVjv
— Telugu Desam Party (@JaiTDP) July 23, 2025
-
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
విశాఖలో కుమారస్వామి- స్టీల్ ప్లాంట్ రోడ్ మ్యాప్ ఆయన చేతిలో -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు












Click it and Unblock the Notifications