గోదావరి పుష్కరాలు: చంద్రబాబుకు ప్రమాదం తప్పిందిలా? (ఫోటోలు)
రాజమండ్రి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఫోటోల్లో. గోదావరి పుష్కరాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు పుష్కర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు గాను లాంచిలో వెళ్లారు.
సుమారు రెండు గంటలపాటు చంద్రబాబు గోదావరిలో బోటులో విహరించారు. పుష్కరఘాట్, కోటిలింగాలఘాట్, గౌతమీఘాట్, వీఐపీ ఘాట్లలో స్నానమాచరిస్తున్న భక్తులను సీఎం పలకరించారు. ఈ సమయంలోనే సీఎం ప్రయాణిస్తున్న బోటు, మీడియా ప్రతినిధులున్న బోటు ఢీకొన్నాయి.

చంద్రబాబుకు ప్రమాదం తప్పిందిలా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. పుష్కర ఘాట్ల పర్యవేక్షణకు బాబు లాంచిలో వెళ్లారు.

చంద్రబాబుకు ప్రమాదం తప్పిందిలా?
సుమారు రెండు గంటలపాటు చంద్రబాబు గోదావరిలో బోటులో విహరించారు. పుష్కరఘాట్, కోటిలింగాలఘాట్, గౌతమీఘాట్, వీఐపీ ఘాట్లలో స్నానమాచరిస్తున్న భక్తులను సీఎం పలకరించారు.

చంద్రబాబుకు ప్రమాదం తప్పిందిలా?
ఓ బోటులో సిఎం చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు. మరో బోటులో మీడియా వెళ్లింది.

చంద్రబాబుకు ప్రమాదం తప్పిందిలా?
టూరిజం బోటు ప్రాంతం నుంచి విఐపి ఘాట్, సరస్వతీ ఘాట్, గౌతమీ ఘాట్లను పరిశీలించి కొవ్వూరు తిరుగు పయనం అవుతున్న సమయంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న లాంచీని మీడియా లాంచ్ ఢీకొట్టింది.

చంద్రబాబుకు ప్రమాదం తప్పిందిలా?
మీడియా బోటు చంద్రబాబు ప్రయాణిస్తున్న లాంచీని ఢీకొట్టింది. అయితే, ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనుభవం లేని డ్రైవర్లు బోట్లను నడిపినందు వల్లే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.

చంద్రబాబుకు ప్రమాదం తప్పిందిలా?
శుక్రవారం చంద్రబాబు దాదాపు రెండు గంటల పాటు ప్రత్యేక బోటులో గోదావరి పర్యటించి పుష్కర ఘాట్లను పర్యవేక్షించారు. సీఎం పర్యటనకు ఇరిగేషన్ శాఖ రెండు బోట్లను ఏర్పాటు చేసింది.

చంద్రబాబుకు ప్రమాదం తప్పిందిలా?
దీంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. మీడియా బోటు స్వల్పంగా దెబ్బతింది. కోటి లింగాల రేవు ఘాట్ వద్ద కూడా సీఎం లాంచి మట్టిలో చిక్కుకొని ఓవైపు ఒరిగిపోయింది. కాగా, సీఎం పర్యటన ఉన్నా... గోదావరి లంకల్లో ముందస్తుగా రక్షణపరంగా పరిశీలన జరపలేదు.












Click it and Unblock the Notifications