బోటు ప్రమాదంపై నివేదిక, షాకింగ్: ఆ కంపెనీక అనుమతి లేదు, ఉదయమే అధికారులు దింపేశారు
బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రాథమిక నివేదిక అందింది. ఈ నివేదికలోను ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రమాదం నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
విజయవాడ: బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రాథమిక నివేదిక అందింది. ఈ నివేదికలోను ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రమాదం నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
Recommended Video

చదవండి: ఇసుకదిబ్బని ఢీకొట్టి, లైఫ్ జాకెట్లు అడిగినా ఇవ్వక: బోటు ప్రమాదానికి కారణాలివీ!
సబ్ కలెక్టర్ కార్యాలయంలో దీనిని ఏర్పాటు చేశారు. మృతులంతా ఒంగోలు వాసులు కావడంతో ప్రకాశం జిల్లాలో టోల్ఫ్రీ నంబర్ 08592 281400 ఏర్పాటు చేశారు.
చదవండి: ప్రమాదంపై జగన్, మీకు చేతకాకుంటే మేమొచ్చాం: ఊగిపోయిన వైసిపి నేత, తొలుత స్పందించింది వారే

అనుమతి లేకుండా బోటు నడిపిన ప్రయివేటు సంస్థ
ఈ బోటును నడిపింది రివర్ బే సంస్థ అని తెలుస్తోంది. దీనికి బోటు నడిపేందుకు అనుమతి లేదు. అయినప్పటికీ ప్రయాణీకులను తీసుకొని వెళ్లిందని తెలుస్తోంది. ఈ మేరకు ఆ సంస్థకు అనుమతి లేదని ప్రాథమిక నివేదికలోను అధికారులు తెలిపారు.

బోటును నియంత్రించలేకే ప్రమాదం జరిగింది
బోటును నియంత్రించలేకే ప్రమాదం జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. సుడిగుండం వంటివి వచ్చినప్పుడు బోటును నియంత్రించేలా లేదన్నారు. రాయపూడి నుంచి ఫెర్రీ వరకు బోటును నడుపుతున్నట్లు నివేదికలే పేర్కొన్నారు.

ఉదయం ప్రయాణీకులను అడ్డుకున్నాం
బోటు ప్రమాదంపై పర్యాటక శాఖ సెక్రటరీ మీనా మాట్లాడారు. బోటు నడుపుతున్న కంపెనీకి అనుమతులు లేవని చెప్పారు. చట్టవిరుద్ధంగా దానిని తిప్పారన్నారు. యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామన్నారు. ఉదయమే ఆ కంపెనీ బోటు ప్రయాణీకులను ఎక్కించుకుంటే కిందకు దింపామని, ఉదయం అడ్డుకున్నా సాయంత్రం మళ్లీ ఎక్కించుకున్నారన్నారు.

వెంటనే రంగంలోకి దిగారు
కాగా, ప్రమాదం విషయం తెలియగానే 30 మందితో కూడిన రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 45 మందితో కూడిన ఎస్డీఆర్ఎఫ్ బృందం, అరవై మంది డిసాస్టర్ మెంబర్స్ టీం, ఫైర్ సిబ్బంది, ఇతర సిబ్బంది రంగంలోకి దిగింది.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications