వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పై అధికారులకు డెడ్ లైన్ పెట్టిన జగన్ ... ఏం చెప్పారంటే

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ పనులను క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. నేడు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించిన జగన్ పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఇక అధికారులతో పోలవరం పనుల పురోగతిపై ఆయన సమీక్ష చేశారు. ఈ సమీక్షలో సీఎం జగన్ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి డెడ్ లైన్ విధించారు. పనుల పురోగతితో పాటు ముంపు గ్రామాల తరలింపు చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సీఎం జగన్ పోలవరం పర్యటన: క్షేత్ర స్థాయి పనుల పరిశీలన సీఎం జగన్ పోలవరం పర్యటన: క్షేత్ర స్థాయి పనుల పరిశీలన

2021 జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని జగన్ ఆదేశం

2021 జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని జగన్ ఆదేశం

సీఎం హోదాలో రెండోసారి జగన్ పోలవరానికి వెళ్ళిన జగన్ పోలవరం పురోగతి పనులను పరిశీలించి అధికారులతో రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. 2021 జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఎట్టి పరిస్థితిలోనూ వచ్చే ఏడాది సాగునీరు అందించాలని ఆయన ఆదేశించారు. గతంలో ప్రణాళికాలోపం, సమన్వయ లోపం, సమాచార లోపం ఏర్పడింది అని పేర్కొన్న సీఎం జగన్ అధికారులకు పనులు వేగవంతం చెయ్యాలని సూచించారు. నిర్మాణ పనులపై డెడ్ లైన్ విధించారు .

Recommended Video

AP CM YS Jagan Visited Polavarm Project And Examined The Works! | Oneindia Telugu
జూన్‌ నాటికి స్పిల్‌వే పనులు పూర్తికావాలన్న జగన్

జూన్‌ నాటికి స్పిల్‌వే పనులు పూర్తికావాలన్న జగన్


ఇక జూన్‌ నాటికి స్పిల్‌వే పనులు పూర్తికావాలని సూచించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి . పోలవరం ప్రాజెక్టుపై అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలతో జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఇక పనుల పురోగతిపై అధికారులు జగన్ తో మాట్లాడారు. జూన్‌ కల్లా రైట్‌ మెయిన్‌ కెనాల్‌ కనెక్టివిటీ పూర్తవుతుందని అధికారులు చెప్పారు. కాపర్‌ డ్యాంలో ఇప్పుడున్న ఖాళీలు పూర్తిచేస్తే 41.15 మీటర్ల మేర నీటి నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు . ఇక ముంపు గ్రామాల గురించి సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళారు అధికారులు .

ముంపు గ్రామాల ప్రజలపై మానవత్వంతో వ్యవహరించాలన్న సీఎం

ముంపు గ్రామాల ప్రజలపై మానవత్వంతో వ్యవహరించాలన్న సీఎం

పోలవరం ముంపు గ్రామాల ప్రజలను 17వేలకు పైగా కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళారు. దేవీపట్నం మండలంలోని 6 గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు చెబుతున్నారు.అయితే ముంపు గ్రామాల ప్రజల విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. రూపాయి ఎక్కువైనా సరే బాధితులను మానవతా కోణంలో చూసి మంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జగన్‌ సూచించారు.

English summary
CM Jagan has ordered the authorities to complete the Polavaram project by June 2021. He also ordered that irrigation be provided next year under any circumstances. CM Jagan, who had previously said that there was a lack of planning, coordination and communication, advised the officials to speed things up. Deadline imposed on construction work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X