కీలక నిర్ణయం దిశగా సీఎం జగన్ - మంత్రులు, ఎమ్మెల్యేల్లో టెన్షన్..!?
ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ ఇక విజయం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇటు కేబినెట్ విస్తరణ.. పాలనా పరంగా కీలక నిర్ణయాలకు సీఎం జగన్ సిద్దం అవుతున్నారు.
ఈ సమయంలో పార్టీ సీనియర్ నేతలు..మంత్రులు..ఎమ్మెల్యేలకు తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల ప్రచారం వేళ సీఎం జగన్ ఏం చెప్పబోతున్నారనేది ఉత్కంఠను పెంచుతోంది.

పార్టీ నేతలతో కీలక భేటీ
ఎన్నికలకు సిద్దం అవుతున్న సీఎం జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఇప్పటికే పలు మార్లు గడప గడపకు ప్రభుత్వం వర్క్ షాప్ ను సీఎం జగన్ నిర్వహించారు. ఎమ్మెల్యేలకు వారికి ప్రజల్లో ఉన్న గుర్తింపు.. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు పైన సంకేతాలు ఇస్తూ వచ్చారు. కొందరు ఎమ్మెల్యేలకు పని తీరు మెరుగు పర్చుకోవాలంటూ స్పష్టం చేసారు.
ఇక.. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు దూరం కావటం..వారితో పాటుగా మరో ఇద్దరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయటంతో ఆ నలుగురిని పార్టీ సస్పెండ్ చేసింది. అనూహ్యంగా నాలుగు పట్టభ్రదుల నియోజకవర్గాలు.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ విజయం సాధించింది. ఈ సమయంలో పార్టీ నేతలతో సీఎం జగన్ ఎన్నికల దిశగా కీలక నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు.
కొత్త జోష్ నింపేలా కార్యాచరణ
ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్..పట్టభద్రుల నియోజకవర్గాల్లొ టీడీపీ గెలుపు తరువాత పార్టీలో ఎటువంటి నైరాశ్యం లేకుండా సీఎం జగన్ మార్గదర్శకం చేయనున్నారు. పార్టీ నేతల్లో జోష్ నింపుతూ..టీడీపీ గెలుపు ఎలా సాధ్యమైంది..దీని ద్వారా వైసీపీ పైన ఎటువంటి ప్రభావం ఉంటుందనే అంశాన్ని సీఎం వివరించే అవకాశం ఉంది. అదే సమయంలో గత సమావేశంలో దాదాపు 22 మంది ఎమ్మెల్యేల పని తీరు మెరుగు పర్చుకో వటం పైన సీఎం సూచనలు చేసారు.
ఇప్పుడు పార్టీలో టికెట్లు ఇవ్వరనే కారణంగా ఇద్దరు ఎమ్మెల్యేలు దూరం కావటంతో..సీట్ల విషయంలో ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. అదే సమయంలో గెలుపే ప్రామాణికంగా సీట్ల కేటాయింపు ఉంటుందనే అంశం మరోసారి స్పష్టం చేస్తారని..పార్టీని నమ్ముకున్న వారికి సీట్లు రాకున్నా వారి సేవలను మరో విధంగా ఉపయోగించు కుంటామని సీఎం చెబుతారని తెలుస్తోంది.
మంత్రివర్గ విస్తరణ పైనా క్లారిటీ
ఏపీలో మంత్రివర్గ విస్తరణ ఖాయమనే ప్రచారం సాగుతోంది. దీని పైన ఈ భేటీలో ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ ప్రక్షాళన గురించి సీఎం కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో ప్రచారం సాగుతున్నట్లుగా ప్రక్షాళన ఉంటుందా లేదా అనేది స్పష్టత ఇస్తారని తెలుస్తోంది.
ఇక, కొద్ది రోజులుగా ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ప్రచారం సాగుతోంది. గతంలో ఇదే తరహా ప్రచారాన్ని పార్టీ నేతలు ఖండించారు. దీని పైన సీఎం జగన్ తేల్చి చెప్పే అవకాశం కనిపిస్తోది. మంత్రివర్గ విస్తరణ.. ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపు పైన ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ మంత్రులు..ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications