ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీదే మొదటి స్థానం .. మారిటైమ్ ఇండియా సదస్సులో సీఎం జగన్
మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021 లో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేడు ప్రారంభించిన ఈ సదస్సులో వర్చువల్ విధానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. నేటి నుండి నాలుగో తేదీ వరకు మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021 సదస్సు కొనసాగనుంది.

మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021 సదస్సులో పాల్గొన్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021 సదస్సులో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. దేశంలో రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, దేశంలోని ఎగుమతుల్లో నాలుగు శాతం ఏపీ వాటా అని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ సదస్సులో స్పష్టం చేశారు.
2030 సంవత్సరం నాటికి దేశ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా పది శాతానికి పెంచాలని లక్ష్యం
030 సంవత్సరం నాటికి దేశ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా పది శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా బలోపేతం చేయడానికి కావలసిన అన్ని వనరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారికి ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అభివృద్ధి జరిగితే 2023 నాటికి వాణిజ్య కార్యకలాపాలు
ఇక రామాయపట్నం , మచిలీపట్నం, భావనపాడులలో గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అభివృద్ధి జరుగుతుందని 2023 నాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వీటి ద్వారా అదనంగా వంద మిలియన్ టన్నుల కార్గో రవాణాకు అవకాశం ఏర్పడుతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
ఏపీలో జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పారిశ్రామికాభివృద్ధికి తీసుకోవలసిన అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు .
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications