సీఎం జగన్ - షర్మిల మరోసారి : ఇడుపులపాయ వేదికగా - విజయమ్మ ప్లీనరీకి హాజరుపైనా..!!
సీఎం జగన్ కడప పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జన్మదినం. దీంతో...రేపు తన సొంత నియోజకవర్గం పులివెందుల చేరుకోననున్న సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు సాయంత్రానికి ఇడుపులపాయ చేరుకుంటారు. రేపు ( గురువారం) సాయంత్రం 5.15కు ఇడుపులపాయ చేరుకుంటారు. 5.20కి హెలీప్యాడ్ నుంచి బయలుదేరి 5.25కు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్కు చేరుకుని రాత్రి బస చేస్తారు. అయితే, ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న సీఎం జగన్ సోదరి షర్మిల..తల్లి విజయమ్మ సైతం ఇడుపుల పాయకు రానున్నట్లు సమాచారం.
వైఎస్సార్ ఎస్టేట్స్ కు ఫ్యామిలీ మొత్తం
షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన సమయం..నుంచీ వైఎస్సార్ జన్మదినం - వర్దంతి నాడు ఇడుపులపాయలో వీరిద్దరి రావటం..కలుసుకోవటం పైన ఆసక్తి కర చర్చ జరుగుతూ వస్తోంది. గతంలో ప్రతీ క్రిస్మస్ కు అందరూ కలిసి పులివెందులలో కలిసే వారు. కానీ, కొంత కాలంగా అది జరగటం లేదు. ఇక, ఇప్పుడు షర్మిల తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్రలో ఉన్నారు. అయితే, తన తండ్రి జన్మదినం కావటంలో రేపు సాయంత్రానికి ఇడుపులపాయ చేరుకుంటారని సమాచారం. రేపు వైఎస్సార్ కుటుంబ సభ్యులు వైఎస్సార్ ఎస్టేట్స్ లోనే బస చేయనున్నారు.
వైఎస్సార్ కు నివాళి - ప్లీనరీకి పయనం
8వ
తేదీ
ఉదయం
8
గంటలకు
ఇడుపులపాయలోని
వైఎస్సార్
ఎస్టేట్
నుంచి
బయలుదేరి
8.05కు
వైఎస్సార్
ఘాట్కు
చేరుకొని
దివంగత
వైఎస్
రాజశేఖర్రెడ్డికి
నివాళులు
అర్పించి
ప్రార్థనల్లో
పాల్గొంటారు.
8.45కు
వైఎస్సార్
ఘాట్
నుంచి
బయలుదేరి
8.50కు
ఇడుపులపాయలోని
హెలీప్యాడ్కు
చేరుకుంటారు.
8.55కు
హెలీకాప్టర్లో
బయలుదేరి
9.10కి
కడప
విమానాశ్రయానికి
చేరుకుంటారు.
గత
ఏడాది
ఇదే
విధంగా
కుటుంబ
సభ్యులు
అందరూ
కలిసి
వైఎస్సార్
కు
నివాళి
అర్పించి..
ప్రార్ధనల్లో
పాల్గొన్నారు.
ఇప్పుడు
కూడా
కలిసే
నివాళి
అర్పించనున్నట్లు
తెలుస్తోంది.
ఇక,
విజయమ్మ
పార్టీ
ప్లీనరీకి
హాజర
పైన
కొద్ది
రోజులుగా
చర్చ
సాగుతోంది.
ఒక
దశలో
వైసీపీ
గౌరవాధ్యక్ష
పదవి
వీడటానికి
సైతం
విజయమ్మ
సిద్దం
అయ్యారనే
ప్రచారం
సాగింది.
పార్టీ బైలాస్ లోనూ మార్పుల దిశగా
కానీ, ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ తో పాటుగానే విజయమ్మ సైతం పార్టీ ప్లీనరీ ప్రారంభోవత్సవ సభకు హాజరవుతారని తెలుస్తోంది. 2017 లో జరిగిన ప్లీనరీలో విజయమ్మతో పాటుగా షర్మిల -పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైతం హాజరయ్యారు. అయితే, ఈ సారి పార్టీ ప్లీనరీ వేదికగా పార్టీ రాజ్యాంగానికి సంబంధించి కొన్ని సవరణలు ప్రతిపాదిస్తున్నట్లుగా సమాచారం. శాశ్వత గౌరవాధ్యక్షురాలు..శాశ్వత అధ్యక్షుడు హోదాలో ఈ రెండు పదవులను ఖరారు చేస్తూ పార్టీ బైలాస్ లో మార్పులు చేర్పులు చేయనున్నట్లు నేతలు చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు మరోసారి ఇడుపుల పాయలో వైఎస్సార్ కుటుంబం ఒక్కటిగా కనిపించనుండటం ఆసక్తి కరంగా మారనుంది.