ప్రతిపక్షాలపై సీఎం జగన్ తాజా అస్త్రం - విశాఖ కేంద్రంగా, ఇక మొదలు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన తరువాత ఎన్నికల ప్రణాళికల అమలు మొదలు పెడుతున్నారు. ఈ నెల 9న పార్టీ నేతలతో ముఖ్యమంత్రి జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఇక..దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించేందుకు జగన్ సిద్దమయ్యారు. ఈ సమయంలోనే ఈ నెల 16న విశాఖ కేంద్రంగా సీఎం జగన్ ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
విశాఖకు సీఎం జగన్: ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమరశంఖం పూరించేందుకు సిద్దమయ్యారు. ఏపీ వై నీడ్స్ జగన్ అనే కార్యక్రమం ద్వారా ఈ నెల 11వ తేదీ నుంచి ప్రతీ ఇంటికి పార్టీ శ్రేణులు వెళ్లేలా కార్యాచరణ సిద్దం చేసారు ఈ నెల 9న జరిగే సమావేశంలో ఈ మేరకు దిశా నిర్దేశం చేయనున్నారు.

ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ది దారుల్లో ఎవరైనా అర్హత ఉండి అందకుంటే వారికీ అమలయ్యేలా అధికారులకు ఇప్పటికే సూచనలు చేసారు. దీని ద్వారా తమకు మరోసారి అధికారం అందిస్తుందని నమ్ముకున్న సంక్షేమ ఓట్ బ్యాంక ను మరింత పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో విశాఖ కేంద్రంగా ప్రతిపక్షాలను కౌంటర్ చేసేందుకు సీఎం సిద్దమయ్యారు.
ఓట్ బ్యాంక్ పై గురి: విశాఖ లో అభివృద్ధి...పాలన ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పూర్తి పట్టు సాధించేలా సీఎం జగన్ కొత్త అస్త్రం సంధిస్తున్నారు. అందులో భాగంగా విశాఖలో ఈ నెల 16న ముఖ్యమంత్రి ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అదే సమయంలో విశాఖలో ప్రారంభించే క్యాంపు కార్యాలయం కోసం భూమి పూజ చేయనున్నారు.
ముఖ్యమంత్రి పాలన ప్రారంభించేందుకు వీలుగా రుషికొండపై ఆరు బ్లాక్ లు పర్యాటక శాఖ సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా కళింగ బ్లాక్ కు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ పూజ నిర్వహిస్తారు. దసరా నుంచి వారంలో రెండు రోజులు ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచే పాలన చేసేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఆరు బ్లాకుల్లో ముందుగా రెండింటిని ఈ నెలలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం సాగుతోంది.

ఎన్నికల సమరశంఖం: ఇక. ఈ నెల 23 నుంచి విశాఖలో అధికారికంగా పాలన ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. దీనికి సంబంధించి 16న పర్యటనలో సీఎం జగన్ స్పష్టత ఇవ్వనున్నారు. అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక..రాజకీయంగానూ విశాఖ నుంచి ఎన్నికల సమర శంఖం పూరించేందుకు జగన్ సిద్దమయ్యారని తెలుస్తోంది.
వారంలో రెండు రోజులు జిల్లాల పర్యటనకు కేటాయించనున్నారు. అదే విధంగా పార్టీ పరిస్థితులు..అభ్యర్దుల ఎంపిక పైనా నియోజకవర్గాల్లోనే ముఖ్యమంత్రి ప్రకటనలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకొనేందుకు ముఖ్యమంత్రి సిద్దం అవుతున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications