అఖండ హారతి: బాబు పక్కనే ఈశ్వరన్, సెల్ఫోన్లో చిత్రీకరించారు(ఫోటోలు)
రాజమండ్రి: నవ్యాంధ్ర నూతర రాజధాని అమరావతి సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్తో సోమవారం రాజమండ్రి చేరుకున్న సింగపూర్ వాణిజ్య శాఖ మంత్రి ఈశ్వరన్ గోదావరి పుష్కర ఘాట్ను సందర్శించారు. సాయంత్రం 6.45కు అఖండ హారతి కార్యక్రమం ప్రారంభమై, 45 నిమిషాల సేపు కొనసాగింది.
ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్, రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ తయారు చేసిన 30 మంది సభ్యుల బృందం హాజరయ్యారు. చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ బృందం సభ్యులు పుష్కరఘాట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తివాచీపై ఆసీనులయ్యారు.

అఖండ హారతికి బాబు, ఈశ్వరన్
నవ్యాంధ్ర నూతర రాజధాని అమరావతి సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్తో సోమవారం రాజమండ్రి చేరుకున్న సింగపూర్ వాణిజ్య శాఖ మంత్రి ఈశ్వరన్ గోదావరి పుష్కర ఘాట్ను సందర్శించారు. సాయంత్రం 6.45కు అఖండ హారతి కార్యక్రమం ప్రారంభమై, 45 నిమిషాల సేపు కొనసాగింది.
అఖండ హారతికి బాబు, ఈశ్వరన్
ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్, రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ తయారు చేసిన 30 మంది సభ్యుల బృందం హాజరయ్యారు. చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ బృందం సభ్యులు పుష్కరఘాట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తివాచీపై ఆసీనులయ్యారు.

అఖండ హారతికి బాబు, ఈశ్వరన్
అనంతరం గోదావరి హారతి ఎప్పటిలాగానే వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రారంభమైంది. చంద్రబాబు, ఏపీ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ల మధ్య కూర్చుని గోదావరి ఇస్తున్న హారతిని ఆయన ఆసక్తిగా తిలకించారు.

అఖండ హారతికి బాబు, ఈశ్వరన్
సింగపూర్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని కుతూహలంగా తిలకించారు. అఖండ హారతి అపురూప దృశ్యాన్ని చూసి ఆయన మైమరచిపోయారు. ఆ దృశ్యాన్ని ఆయన తన సెల్ఫోన్తో చిత్రీకరించారు.

అఖండ హారతికి బాబు, ఈశ్వరన్
అంతక ముందు గోదావరి పుష్కరాలను సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గగనతలం నుండి రాజమండ్రి నగరంలోని స్నానఘట్టాలు, నగరంలోని పుష్కరాల సందడిని చూశారు.

అఖండ హారతికి బాబు, ఈశ్వరన్
గోదావరికి అఖండ హారతి కార్యక్రమం మరో గంటలో ప్రారంభమవుతుందనగా సోమవారం సాయంత్రం పుష్కర ఘాట్ వద్ద నదిలో పెద్ద ఎత్తున గాలి, వాన వచ్చింది.

అఖండ హారతికి బాబు, ఈశ్వరన్
గోదావరి గాలులకు ఘాట్లో ఉన్న చిన్న పడవలు బోల్తా పడ్డాయి. ఘాట్ వెలుపల టెంట్లు కూలాయి. జనం చెల్లా చెదురయ్యారు.

అఖండ హారతికి బాబు, ఈశ్వరన్
కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఊగడం అందర్నీ ఆశ్చర్య పరచింది. అయితే ఈ విగ్రహం రాతితో కాని, కాంస్యంతో కాని చేసింది కాదని అధికారులు తెలిపారు.

అఖండ హారతికి బాబు, ఈశ్వరన్
సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వచ్చిన గోదావరి పెనుగాలుల తాకిడి అర గంటలో తగ్గడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

అఖండ హారతికి బాబు, ఈశ్వరన్
నవ్యాంధ్ర రాజధాని అమరావతి సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ రూపొందించిన మంత్రి ఈశ్వరన్తో పాటు, 30 మంది సభ్యుల బృందాన్ని రాజమండ్రి ఎంపీ మురళీ మోహాన్ సన్మానించారు.












Click it and Unblock the Notifications