టిడిపిలోకి కడప వైసిపి ప్రజాప్రతినిధులు: 'జగన్ బంధువుల ఫిర్యాదు వల్లే'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై టిడిపి నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ విమర్శలు గుప్పించారు. జగన్ పాదయాత్ర నవ్వులాటగా మారిందన్నారు.
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై టిడిపి నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ విమర్శలు గుప్పించారు. జగన్ పాదయాత్ర నవ్వులాటగా మారిందన్నారు.
ఆదివారం మైదుకూరు మండలం మాచుగారిపల్లెలో వైసిపికి చెందిన మిట్టమానుపల్లె ఎంపీటీసీ సభ్యురాలు కానాల వసుంధర, నాయకులు పోలిరెడ్డి, గోవిందురెడ్డి వారి అనుచరులతో టిడిపిలో చేరారు.
చదవండి: కర్నూలులో రెండూ ఖాళీ, జగన్ రంగంలోకి దిగినా: బుట్టా రేణుక దారిలో మరో ఇద్దరు

ఓ రోజు భోజనం చేసి, నిరాహార దీక్ష చేసినట్లుగా
వారం రోజులు నిరాహార దీక్ష చేసి మధ్యలో ఒకరోజు భోజనం చేసి మళ్లీ నిరాహార దీక్ష చేస్తే ఎలా ఉంటుందో ఆరు రోజుల పాటు పాదయాత్ర చేసి ఏడో రోజు కోర్టుకు హాజరైతే, కోర్టుకు హాజరై తిరిగి పాదయాత్ర చేస్తే అలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేస్తూ కోర్టుకు హాజరవడాన్ని చూస్తుంటే నిరాహార దీక్ష సమయంలో ఓ రోజు భోజనం చేసినట్లుగానే ఉంటుందన్నారు.

జగన్ బాధపడుతున్నారు
వర్షాలతో జలాశయాలు నిండుకుని రాష్ట్ర ప్రజలంతో సంతోషంగా ఉంటే జగన్ మాత్రమే బాధగా ఉన్నారని సీఎం రమేష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ ముందుకు వెళుతుంటే జగన్ అడ్డుకుంటున్నారన్నారు.

జగన్ బంధువుల ఫిర్యాదు వల్లే
ఉపాధి హామీ పథకంలో రాష్ట్రంలో ఆరు వేల కిలోమీటర్లు సిమెంటు రోడ్లు వేయగా దుర్వినియోగం జరిగిందంటూ జగన్ బంధువులైన వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో కూలీలకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని సీఎం రమేష్ చెప్పారు.

ఆ ఆలోచన జగన్ చేయడం లేదు
ప్రజలకు ఏమి చేస్తే మేలు జరుగుతుందనే ఆలోచన జగన్ చేయడం లేదని సీఎం రమేష్ మండిపడ్డారు. 80 శాతం మంది ప్రజలు చంద్రబాబు సీఎం అయితేనే అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయంతో ఉన్నారన్నారు. టిటిడి ఛైర్మన్గా సుధాకర్ యాదవ్ పేరును సీఎం పరిగణలోకి తీసుకున్నారన్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications