సీయం రమేష్ కు జలక్ : ఊహించని నిర్ణయం : ఫిర్యాదు చేసిందెవరు..!
Recommended Video

ఓ అరుదైన నిర్ణయం జరిగింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీయం రమేస్ వాట్సప్ ఖాతా పై వేటు పడంది. నిబంధన ల ఉల్లంఘన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సప్ సంస్థ ప్రకటించింది. అయితే, దీని పై కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని సీయం రమేష్ ఆరోపిస్తున్నారు.
సీయం రమేష్ పై అరుదైన నిర్ణయం..
టిడిపి నేత..రాజ్యసభ సభ్యుడు అయిన సీయం రమేష్ కు విచిత్ర అనుభవం ఎదురైంది. వాట్సప్ సమాచారం పరుగు లు పెడుతున్న వేళ..ఆ సంస్థ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రమేష్కు చెందిన వాట్స్ప్ అకౌంట్పై ఆ సంస్థ వేటు వేసింది. ఆయన ఖాతాను నిషేధించింది. సీఎం రమేష్కు వాట్సాప్ సేవలను వాడుకునే హక్కును కోల్పోయారని ఆ సంస్థ వివరించింది. కొద్దిరోజులుగా సీఎం రమేష్ వాట్సాప్ ఖాతా పనిచేయడం లేదు. దీనిపై ఆయన వివరణ కోరు తూ వాట్సాప్ సంస్థకు లేఖ రాశారు. సంస్థ నిబంధనలు ఉల్లంఘించారని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. నిబంధన ల ఉల్లంఘనలపై ఫిర్యాదులు అందాయని వాట్సాప్ సంస్థ పేర్కొంది. అయితే దీని వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉం దని సీఎం రమేష్ ఆరోపించారు.అయితే, ఇప్పుడు ఈ వ్యవహారం ఏపిలో..టిడిపి వర్గాల్లో హల్చల్ చేస్తోంది.

ఫిర్యాదు చేసెందెవరు..
అసలు సీయం రమేష్ వాట్సప్ ఎందుకు స్తంభించిది. ఆయన ఏం చేసారు.. ఆయన పై ఎవరు ఫిర్యాదు చేసారు.. ఏ మని చేసారు..ఇప్పుడు ఈ ప్రశ్నలు అందరిలోనూ మొదలయ్యాయి. వాట్సప్ అన్నది ఇప్పుడు ప్రతీ ఒక్కిరి సర్వ సా ధారణంగా మారిపోయింది. కేవలం ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రకే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఓ కీలక వ్యక్తికి సంబంధిం చిన ఖాతాను ఆషామాషీగా క్లోజ్ చేయరు. దీనికి బలమైన కారణాలు..అంత కంటే బలమైన ఆధారాలు ఉంటే మినహా వాట్సప్ సంస్థ ఇటువంటి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్న మాట. దీంతో..అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగిందనే చర్చ ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. ఇది కేంద్ర కుట్రగా చెబుతున్న సీయం రమేష్ అసలు ఏం జరిగిందో ఆయనే చెప్పాలి.












Click it and Unblock the Notifications