సీఎం జగన్ మంచి మనసు: ఆ తల్లికి రూ. లక్ష చెక్కు, నెలకు రూ. 3వేలు
కడప: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. బుధవారం మదనపల్లె టిప్పు సుల్తాన్ గ్రౌండ్స్ నుంచి 4వ దశ జగనన్న విద్యా దీవెన లబ్దిని ప్రారంభించారు సీఎం జగన్. ఈ సందర్భంగా వేదిక వద్ద హమీద తన కుమారుడు మొహమ్మద్ అలీకి దీర్ఘకాలిక వ్యాధి ఉన్న విషయం దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి తన దయార్ద హృదయాన్ని చూపారు.

తన బిడ్డతో జగన్ వద్దకు మహిళ
హమీద అనే మహిళ తన బిడ్డ మహ్మద్ అలీ అనే చిన్నారిని ఎత్తుకుని బుధవారం టిప్పు సుల్తాన్ గ్రౌండ్స్లో జరిగిన బహిరంగ సభకు వచ్చారు. తన బిడ్డ తలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడని కన్నీరుపెట్టుకుంది. చికిత్స చేయించడానికి ఆర్ధిక స్థోమత సరిపోక ఇబ్బందులు పడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్ళారు.

మహిళను ఆదుకోవాలని జగన్ ఆదేశం
వివరాలు ఆరా తీసిన తర్వాత విషయం అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి జగన్.. వెంటనే ఆమెకు ఆర్ధిక పరంగా సహాయం అందజేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గిరీష
పీఎస్ వెంటనే స్పందించారు.
ఆ మహిళకు రూ. లక్ష సాయం, నెలకు రూ. 3వేలు
ఈ కార్యక్రమం అనంతరం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం లో రూ. లక్ష చెక్కును ఆమెకు అందించారు. అలాగే నెలవారీగా 3000 రూపాయల పింఛను అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే స్విమ్స్లో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ సూచించారు. దీంతో సీఎం జగన్, జిల్లా కలెక్టర్కు హమీద ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications