ఎగ్జిట్ పోల్స్ పై జగన్ లెక్క ఇలా - వైసీపీకి వచ్చే సీట్లివే..!!
ఏపీలో ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. అధికారం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ పెరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ వెల్లడైనా ఇంకా స్పస్టత రాలేదు. కానీ, ప్రధాన పార్టీలు మాత్రం ఎవరికి అనుకూలం గా ఉన్న సర్వేను చూసి నమ్మకం పెట్టుకుంటున్నారు. ఇదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ పైన పార్టీ ముఖ్యులతో జగన్ స్పందించారు. తన లెక్క ఏంటో జగన్ స్పష్టం చేసారు. అధికారంలోకి రావటంతో పాటుగా పార్టీ గెలిచే సీట్లపైన క్లారిటీ ఇచ్చారు.
ధీమాగా సీఎం జగన్
ఎగ్జిట్ పోల్స్ లో భిన్న అంచనాలు వెల్లడయ్యాయి. జాతీయ స్థాయిలో వెల్లడైన మెజార్టీ సర్వేలు కూటమికి అనుకూలంగా ఇచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి వైసీపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసాయి. పార్థా దాస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి 110-120, టీడీపీ కూటమికి 55-65 అసెంబ్లీ సీట్లు వస్తాయి. ఇక సీపీఎస్ అంచనాల ప్రకారం వైసీకి 97 నుంచి 108 అసెంబ్లీ సీట్లు వస్తాయి. కాంగ్రెస్కు 0 నుంచి ఒక్క అసెంబ్లీ సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక పొలిటికల్ లాబొరేటరీ ఎగ్జిట్ పోల్ ప్రకారం వైసీపీకి 108 సీట్లు వస్తాయి. కూటమికి 67 అసెంబ్లీ సీట్లు వస్తాయి. ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్లో వైసీపీ 98 నుంచి 116 అసెంబ్లీ సీట్లు సాధిస్తుంది. జన్మత్ అంచనాల ప్రకారం వైసీపీ 95-103 సీట్లు, టీడీపీ 67-75 సీట్లు సాధిస్తాయి. ఆరా సంస్థ వైసీపీకి అధికారం ఖాయమని చెబుతోంది.

జగన్ అంచనాలు
ఇక,ఎగ్జిట్ పోల్స్ పైన జగన్ పార్టీ ముఖ్యుల మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ గతంలో తాను చెప్పిన 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామనే మాటలనే తిరిగి రిపీట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా...జూన్ 4న భారీ మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పుకొచ్చారు. పోలింగ్ శాతం నమోదు..మహిళల మద్దతు...సామాజిక వర్గాల తీర్పు గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తొలి నుంచి నమ్ముకున్న వారంతా పార్టీకి అండగా నిలిచారని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. జూన్ 4న వెల్లడి కానున్న ఫలితాలతో దేశం మొత్తంఏపీ వైపు చూస్తుందని జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రతిపక్షం గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తన్న అంశం పైన జగన్ ఎలాంటి కామెంట్ చేయలేదని చెబుతున్నారు.

గెలుపు ఖాయం
జగన్ విదేశాలకు వెళ్లిన తరువాత ఏపీలో రాజకీయంగా చోటు చేసుకున్న అంశాల పైన చర్చ జరిగింది. అధికారుల మార్ప, పిన్నెల్లి పై కేసు, కౌంటింగ్ పైన వస్తున్న సమాచారం గురించి పార్టీ నేతలు జగన్ కు వివరించారు. అయితే, జగన్ మాత్రం పూర్తి విశ్వాసంతో ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. తాము గెలవటం ఖాయమని..జూన్ 9న విశాఖలో ప్రమాణ స్వీకారం ఉంటుందని వైసీపీ ముఖ్యనేతలు ధీమాగా చెబుతున్నారు. కానీ, ఇదే సమయంలో టీడీపీ కూటమి మాత్రం నేటి ఎగ్జిట్ పోల్స్..జూన్ 4న ఫలితాల్లోనే తమ గెలుపు ఖాయమని వాదిస్తున్నారు. దీంతో..ఎన్నికల ఫలితంపైన ఉత్కంఠ కొనసాగుతోంది.
-
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు -
పండగపూటా పాచిమాటలేనా? -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications