వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయ‌న‌పై వైఎస్ జ‌గ‌న్ ట్వీట్ వైర‌ల్‌

|
Google Oneindia TeluguNews

తెలుగు వాడుక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతినే మ‌నం తెలుగు భాషా దినోత్స‌వంగా జ‌రుపుకుంటాం. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. 'వాడుకభాష ఉద్యమానికి ఆద్యులు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం మ‌నంద‌రికీ ఎంతో గర్వకారణం. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించ‌డంతోపాటు తెలుగు భాష తియ్య‌ద‌నాన్ని సామాన్యుడికి చేరువ చేసిన రామ్మూర్తి పంతులు గారిని ప్ర‌జ‌లు మ‌ర‌వ లేర‌ని, తెలుగు భాషా సంస్కర్తల్లో అగ్రగణ్యులుగా నిలిచారంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

cm ys jagan tweet on gidugu ramamurthy pantulu birth aniversary

ఆగ‌స్టు 29వ తేదీ తెలుగు భాషా దినోత్స‌వం సంద‌ర్భంగా ఇక‌నుంచి దుకాణాలపై బోర్డుల్లో పేర్ల‌న్నీ తెలుగులోనే ఉండాల‌ని, అలాగే ప్రభుత్వ కార్యాల‌యాలు, ఇత‌ర వ్య‌వ‌స్థ‌ల్లో తెలుగును త‌ప్ప‌నిస‌రి చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది. ఇవి అమ‌లుకాక‌పోతే జ‌రిమానాతోపాటు జైలుశిక్ష కూడా విధించ‌నున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ తెలుగు భాషాభివృద్ధి ప్రాథికార సంస్థ‌ను కూడా ఏర్పాటు చేయ‌బోతున్నారు. దీనిపై భాషాభిమానులు ప్ర‌భుత్వంపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మ‌న మాతృభాష‌ను ఎప్పుడూ నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ద‌ని, మాతృభాష‌లో పూర్తిస్థాయి ప‌ట్టు సాధిస్తేనే ఇత‌ర భాష‌ల‌ను సులువుగా నేర్చుకోవ‌డం వీల‌వుతుంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. ఉపాధి కోసం ఇత‌ర భాష‌ల‌ను నేర్చుకున్న‌ప్ప‌టికీ మాతృభాష‌ను మాత్రం ఎప్పుడూ మ‌ర‌వ‌వ‌ద్దంటూ సూచిస్తున్నారు.

English summary
We celebrate Telugu Language Day on the birth anniversary of Gidugu Rammurthy Panthulu, the father of Telugu usage.On this occasion Chief Minister YS Jaganmohan Reddy recalled his services.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X