అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాకినాడలో ఘరానా మోసం: 10 లక్షల ఏటీఎం డబ్బుతో పరార్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ఉద్యోగి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. సీఎంఎస్ సంస్ధకు చెందిన దుర్గా భరణికుమార్‌ అనే ఉద్యోగి రూ. 10 లక్షల డబ్బుతో ఆదివారం ఉదయం పారిపోయాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

cms employee escapes with rs 10 lakhs in kakinada

సీఎంఎస్ సంస్థ యాజమాన్యం విధుల్లో భాగంగా దుర్గా భరణికుమార్‌‌కు ఏటీఎమ్‌‌లో నగదు పెట్టే బాధ్యతను అప్పగించింది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఏటీఎంలో నగదు పెట్టేందుకు అతని చేతికి రూ. 10 లక్షల నగదు అప్పగించింది.

అయితే, అతడు ఏటీఎంలో నగదు పెట్టుకుండా అటునుంచే అటే ఆ డబ్బుతో పారిపోయాడు. దాంతో సీఎంఎస్ సంస్థ యజమాని పోలీసు స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేసుకుని ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

English summary
cms employee escapes with rs 10 lakhs in kakinada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X