వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు ఓటేయాలని ప్రామిస్!: బ్రదర్ అనిల్‌పై ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Complaint against Anil Kumar
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్ పైన రాష్ట్ర క్రైస్తవ సామాజిక ఐక్యవేదిక ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. చిత్తూరులోని కారుణ్య క్యాంపస్‌లో ప్రేమ విందు పేరుతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు.

ఆ సమావేశంలో పాస్టర్లకు డబ్బులు పంచుతున్నారని వారు ఆరోపించారు. చర్చిలకు డబ్బులు ఇస్తామని ఆయన వాగ్ధానం చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటు వేయాలని ప్రమాణం చేయిస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

కాగా, ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో ఎటువంటి ఆధారాలు చూపని రూ.85 కోట్ల నగదును సీజ్ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

సీమాంధ్రలో మే 7వ తేదీన అసెంబ్లీ, లోకసభ ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల తేదీకి పదిరోజుల ముందుగా ఓటర్లకు స్లిప్పులు ఇస్తామన్నారు. ఎన్నికల కమిషన్ ద్వారా జారీ చేసిన స్లిప్పుల్లో ఓటరు గుర్తింపు ఫోటో కూడా పొందుపరుస్తున్నట్లు చెప్పారు.

English summary
State Chrisitan Samajika AIkya Vedika complained against Brother Anil Kumar to EC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X