ఎవరిమీదన్నా అనుమానం ఉంటే ఎస్పీకి ఫిర్యాదు చేయండి:పవన్కు సలహా ఇచ్చిన మంత్రి పుల్లారావు
విజయవాడ:తన ప్రాణాలకు ముప్పు ఉందన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ఎవరిపైన అయినా అనుమానం ఉంటే ఆ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయవచ్చునని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సలహా ఇచ్చారు.
శనివారం విజయవాడలో ఆయన మీడియాతో, రాష్ట్రంలో ప్రశాంత ప్రాంతాలుగా పేరొందిన ఉభయ గోదావరి జిల్లాల్లో కులాలు, మతాల పేరుతో విద్వేషాలతో రెచ్చగొట్టడం సరికాదని హితవు పలికారు. తనకు కొందరి నుంచి ప్రాణహాని ఉందని అంటున్న పవన్ కళ్యాణ్ ఎవరి నుంచి హాని ఉందో వారి పేర్లు చెప్పాలని ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కోరారు. వారి పేర్లు బయటపెడితే పవన్ కి వారి నుంచి తగిన భద్రత కల్పిస్తామన్నారు.

ఉభయ గోదావరి జిల్లాలు రాష్ట్రానికే ధాన్యాగారాలని...ప్రశాంతతకు, అభివృద్ధికి మారుపేరుగా ఉండే ఉభయగోదావరి జిల్లాలపై అందుకే సీఎంకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. కొల్లేరు ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపుతోందని మంత్రి పుల్లారావు ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రజలు జగన్ను ఓడించి అదృష్టవంతులవడమే కాకుండా...చంద్ర బాబును గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములయ్యారని మంత్రి పుల్లారావు చెప్పుకొచ్చారు.
అనంతరం మంత్రి పుల్లారావు దసరా పండుగ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన ధరోహర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. గుజరాత్ లో గర్భా నృత్యాలలో ఉపయోగించే వస్తువులతో పాటు దాండియా నృత్యాల్లో అలంకరించుకునే వస్తువులను ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంచడం విశేషం. క్రియేటివ్ సోల్ వ్యవస్థాపకులు సుమన్ మీనా, నేహా జైన్ నేతృత్వంలో ఈ ధరోహర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దశావతర దేవాలయానికి మచిలీపట్నంలో తయారు చేసిన ఆభరణాలను సరఫరా చేస్తున్నారని మంత్రి పుల్లారావు చెప్పారు.
మరోవైపు తన భద్రత విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సహా పలువురు టిడిపి నేతలు చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా తన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సిఎం చంద్రబాబు చెబుతున్నట్లు తనకు ఎలాంటి భద్రత అవసరం లేదని నన్ను నేను ఎలా కాపాడుకోవాలో తెలుసునని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కుల రాజకీయాలు చేసేందుకు తాను రాలేదన్నారు. విజ్ఞానవంతులు, మేధావులు రాజకీయాలను శాసించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
-
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
ఉస్తాద్ భగత్ సింగ్ మేనియా.. టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్











Click it and Unblock the Notifications