పవన్కు ప్రశ్న, కుర్చీలు ఖాళీ: చిరు అసహనం(పిక్చర్స్)
రాజమండ్రి/విశాఖ: సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నాయకులు జిల్లాల్లో జోరుగా పర్యటిస్తున్నారు. 21న ప్రారంభమైన సీమాంధ్ర కాంగ్రెసు బస్సుయాత్ర 22న విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగింది.
ఈ సందర్భంగా ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. సీమాంధ్రను కొత్త ఆంధ్రప్రదేశ్గా మారుస్తామని చెప్పారు. కాంగ్రెస్ శ్రేణుల్లో రాష్ట్ర విభజనపై అపోహలు తొలగించడానికే బస్సుయాత్ర చేపట్టామన్నారు.
అనేకమంది పార్టీలో పదవులు అనుభవించి రాత్రికి రాత్రి గోడ దూకి పార్టీలు మారిపోయారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని దాన్ని పూర్తిచేసి తీరతామని చెప్పారు. కాగా, కాంగ్రెస్ సభల్లో కుర్చీలు దాదాపు ఖాళీగా కనిపించాయి. కుర్చీలు ఖాళీగా కనిపించడాన్ని మీడియా పదే పదే చూపిస్తున్నారని చిరు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
పవన్కు ప్రశ్న, కుర్చీలు ఖాళీ: చిరు అసహనం(పిక్చర్స్)
కాంగ్రెస్కు లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారని, వారంతా పార్టీ రక్షణకు ముందుంటారని ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి బస్సుయాత్రలో చెప్పారు.
పవన్కు ప్రశ్న, కుర్చీలు ఖాళీ: చిరు అసహనం(పిక్చర్స్)
కాంగ్రెస్ పార్టీ మంచిదికాదని చెబుతున్న ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారని రఘువీరా ప్రశ్నించారు.
పవన్కు ప్రశ్న, కుర్చీలు ఖాళీ: చిరు అసహనం(పిక్చర్స్)
ఆయా పార్టీలు నిర్వీర్యమైపోయాయి కాబట్టే కాంగ్రెస్ నాయకుల్ని చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలిసో తెలియకో కొందరు పార్టీ నుంచి వెళ్లిపోయారని పార్టీ అధ్యక్షునిగా వారి కోసం తలుపులు తెరిచే ఉంచానన్నారు.
పవన్కు ప్రశ్న, కుర్చీలు ఖాళీ: చిరు అసహనం(పిక్చర్స్)
ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ భిన్నంగా ఉంటుందని, వారు గెలిచినా ఓడినా ఆయా నియోజకవర్గాల్లో వారే పార్టీ ప్రతినిధులుగా వ్యవహరిస్తారని చెప్పారు.
పవన్కు ప్రశ్న, కుర్చీలు ఖాళీ: చిరు అసహనం(పిక్చర్స్)
యువతకు అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. మతతత్వ పార్టీతో జత కలిసి తప్పుచేశామని చెప్పిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఎన్డీయే ప్రభుత్వంలో వాజపేయిని టిష్యూ పేపర్లా వాడుకున్నారన్నారు.
పవన్కు ప్రశ్న, కుర్చీలు ఖాళీ: చిరు అసహనం(పిక్చర్స్)
చంద్రబాబును అండమాన్ జైల్లో పెట్టాలని చెప్పిన బిజెపి... ఎలా జత కట్టాయో ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. తనకు కులం, మతం లేదని చెప్పిన పవన్ కల్యాణ్ మతతత్వ పార్టీ బిజెపితో ఎలా పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు.
పవన్కు ప్రశ్న, కుర్చీలు ఖాళీ: చిరు అసహనం(పిక్చర్స్)
ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటుచేసిన సభలో రఘువీరా మాట్లాడుతూ ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలంతా పాండవులను (కాంగ్రెస్ అభ్యర్థులను) గెలిపించాలని పిలుపునిచ్చారు.
పవన్కు ప్రశ్న, కుర్చీలు ఖాళీ: చిరు అసహనం(పిక్చర్స్)
కౌరవుల మాదిరిగా టిడిపి, బిజెపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఎంతమంది ఉన్నా.. వారిని కాంగ్రెస్ మట్టి కరిపించడం ఖాయమన్నారు.
పవన్కు ప్రశ్న, కుర్చీలు ఖాళీ: చిరు అసహనం(పిక్చర్స్)
ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదం ఇచ్చిన తొలి పార్టీ బిజెపియేనని గుర్తు చేశారు. టిడిపి రెండు ప్రాంతాల్లోనూ వేర్వేరు నాటకాలు ఆడిందని దుయ్యబట్టారు.
పవన్కు ప్రశ్న, కుర్చీలు ఖాళీ: చిరు అసహనం(పిక్చర్స్)
వేగంగా సీమాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఉన్న వనరులు సద్వినియోగం చేస్తామని, అలాగే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్వల్లే సాధ్యమవుతుందని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు.
పవన్కు ప్రశ్న, కుర్చీలు ఖాళీ: చిరు అసహనం(పిక్చర్స్)
శనివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు.
పవన్కు ప్రశ్న, కుర్చీలు ఖాళీ: చిరు అసహనం(పిక్చర్స్)
సీమాంధ్ర అభివృద్ధే ధ్యేయంగా పాటు పడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కాంగ్రె స్కు గడ్డు పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు.
పవన్కు ప్రశ్న, కుర్చీలు ఖాళీ: చిరు అసహనం(పిక్చర్స్)
సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నాయకులు జిల్లాల్లో జోరుగా పర్యటిస్తున్నారు. 21న ప్రారంభమైన సీమాంధ్ర కాంగ్రెసు బస్సుయాత్ర 22న విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగింది.
పవన్కు ప్రశ్న, కుర్చీలు ఖాళీ: చిరు అసహనం(పిక్చర్స్)
సిఎం కుర్చీ కోసం విభజన జరగాలని జగన్ కోరుకున్నారని కాంగ్రెసు నేతలు ఆరోపించారు. అన్ని పార్టీలు లేఖలు ఇచ్చిన తరువాత మాత్రమే కాంగ్రెస్ విభజన ప్రక్రియ చేపట్టిందన్నారు.
పవన్కు ప్రశ్న, కుర్చీలు ఖాళీ: చిరు అసహనం(పిక్చర్స్)
స్వార్థపరులను, పార్టీలు మారే వారిని ఫుట్బాల్లా తన్నాలని పిలుపునిచ్చారు. పిసిసి మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశానికి శ్రీరామరక్ష అన్నారు. ఇటువంటి కష్టనష్టాలు ఎన్నో చూశామని, ఇవి ఒక లెక్క కాదన్నారు.
పవన్కు ప్రశ్న, కుర్చీలు ఖాళీ: చిరు అసహనం(పిక్చర్స్)
కేంద్రమంత్రులు పళ్లంరాజు, జెడి శీలం, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి మాట్లాడుతూ విభజన పాపంలో అన్ని పార్టీల ప్రమేయం ఉందన్నారు.