షర్మిలపై ఫిర్యాదుల వేళ కాంగ్రెస్ హై కమాండ్ అనూహ్య నిర్ణయం, ఇక..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార కూటమి పార్టీలు వైసీపీ లక్ష్యంగా రాజకీయ వ్యూహలు అమలు చేస్తున్నాయి. వైసీపీ సైతం కౌంటర్ రాజకీయం మొదలు పెట్టింది. పలువురు వైసీపీ నేతలు లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఏపీ పైన ఫోకస్ చేసింది. పీసీసీ చీఫ్ షర్మిల పైన కొందరు నేతలు ఢిల్లీ లీడర్స్ కు ఫిర్యాదు చేసారు. ఈ సమయంలో పార్టీ కోసం ఏపీ కేంద్రంగా పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది కాంగ్రెస్ భవిష్యత్ కు కీలకంగా మారనుంది.
ఏపీ కాంగ్రెస్ లో ఆసక్తి కర రాజకీయం మొదలైంది. పీసీసీ చీఫ్ షర్మిల వ్యవహార శైలి పైన కొందరు పార్టీ నేతలు ఢిల్లీకి ఫిర్యాదు చేసారు. షర్మిల మార్పు ఖాయమనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ అధినాయకత్వం ఇదే సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కాంగ్రెస్ బలోపేతం కోసం సీనియర్లను రంగంలోకి దించింది. ఏపి కాంగ్రెస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ల ను నియమించారు. మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం.. మస్తాన్ వలిలకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఇదే సమయంలో పార్టీ ముఖ్య నేతలు 25 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని నియమించింది. ఏఐసిసి పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులుగా మాణిక్యం ఠాగూర్, పీసీసీ చీఫ్ షర్మిల, రఘువీరా రెడ్డి, కె రాజు, పల్లం రాజు, గిడుగు రుద్రరాజు , జేడీ శీలం ,మస్తాన్ వలి, కెవి పి రామచంద్రరావు,చింతా మోహన్ , బాపిరాజు, హర్ష కుమార్, తులసి రెడ్డి, కిల్లి కృపారాణి తో సహ ఇతర నేతలు ఉన్నారు.

అదే విధంగా 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత తిరిగి కాంగ్రెస్ బలోపేతం పైన ఫోకస్ చేయాలని పీసీసీ చీఫ్ రష్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. అయితే, షర్మిల ఆశించిన స్థాయిలో పని చేయటం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. పార్టీలో సమన్వయం లోపించిందని ఢిల్లీ నేతలకు కొందరు ఫిర్యాదు చేసారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ పైన కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే.. ఏపీలో పీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిల మాత్రం తన అన్న జగన్ పైనే రాజకీయ విమర్శలకు ఎక్కువ గా ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో ఉంది. దీంతో, బీసీ మహిళా నేతకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం సాగింది. ఇప్పుడు పార్టీ నాయకత్వం పీఏసీ కమిటీ ఏర్పాటు ద్వారా భవిష్యత్ లో పార్టీ బలోపేతం లక్ష్యంగా బిగ్ టాస్క్ అప్పగించింది.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications