కృష్ణా జిల్లాలో మరింత బలోపేతం: టీడీపీలోకి దేవినేని నెహ్రూ, వేదవ్యాస్?
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మరోసారి 'ఆపరేషన్ ఆకర్ష్'కు తెరలేవనుందా? అంటే అవుననే అంటున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. మరికొంత మంది వైసీపీ నేతలు కూడా టీడీపీ వైపు చూస్తున్నారనే వాదన కూడా ఉంది.
అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరి చేరికలతో ఏపీ రాజకీయాల్లో కీలక జిల్లాగా ఉన్న కృష్ణాలో టీడీపీ మరింతగా బలోపేతం కానుందనే వాదన వినిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే... కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న దేవినేని నెహ్రూ టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ దిశగా సంప్రదింపులు జరుగుతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దేవినేని నెహ్రూ గతంలో టీడీపీలో ఒక వెలుగు వెలిగిన ఆయన పార్టీ చీలిక నేపథ్యంలో ఎన్టీఆర్ తరఫున నిలిచారు. ఆ తర్వాత నెహ్రూ కాంగ్రెస్ లో చేరిపోయారు.

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి అదే పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో దేవినేని నెహ్రూ రాజకీయ జీవితం డైలమాలో పడింది. ఈ నేపథ్యంలో తిరిగి మళ్లీ తన సొంత గూటికి చేరేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారట.
మరోవైపు కృష్ణా జిల్లాకు చెందిన మరో సీనియర్ రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకే చెందిన బూరగడ్డ వేదవ్యాస్ కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా వేదవ్యాస్ పనిచేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తరుణంలో ఆయన అందులో చేరారు.
ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికే వచ్చారు. ప్రత్యక్ష రాజకీయాలకు కాస్తంత దూరంగా ఉంటున్న వేదవ్యాస్ తిరిగి యాక్టివేట్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. జిల్లాలో రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన ఈ నేతల చేరిక టీడీపీకి రాజకీయంగా ఉపయోగపడుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications