Amrit Bharat: చర్లపల్లికి మరో అమృత్ భారత్ ప్రారంభం-తెలుగు రాష్ట్రాల్లో హాల్ట్ లు ఇవే..!
అసోంలోని కోక్రఝార్ (కామాఖ్య) నుంచి తెలంగాణలోని చర్లపల్లి స్టేషన్ కు ప్రయాణించే కొత్త అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ (amrit bharat express) ఇవాళ ప్రారంభమైంది. అసోంలో ప్రధాని మోడీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు అసోం, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించబోతోంది. ఈ రైలు అందుబాటులోకి రావడం వల్ల భారత దేశ తూర్పు రాష్ట్రాల కనెక్టివిటీ మరింత మెరుగుపడినట్లయింది.
ప్రస్తుతానికి ఈ కోక్రఝార్-చర్లపల్లి అమృత్ భారత్ రైలును ఒకవైపు మాత్రమే నడుపుతున్నారు. త్వరలోనే రెండు వైపులా రాకపోకల్ని ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఇవాళ అసోంలోని కోక్రఝార్ లో మధ్యాహ్నం 2.30కు ప్రారంభమైన ఈ అమృత్ భారత్ రైలు రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు ఏపీలోని పలాసకు చేరుకుంటుంది. అక్కడి నుంచి శ్రీకాకుళం రోడ్, విజయనగరం, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ మీదుగా ఎల్లుండి ఆదివారం ఉదయం 8.30కు చర్లపల్లి చేరుకుంటుంది.

Strengthening rail connectivity across Assam & the Northeast!
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 13, 2026
3 new train services flagged off by PM @narendramodi Ji
🚆 Kamakhya–Charlapalli Amrit Bharat Express
🚆 Guwahati–New Jalpaiguri Express
🚆 Narangi–Agartala Express pic.twitter.com/7wj1QnCprK
ఈ లెక్కన మూడు రోజుల పాటు ఈ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణం ఉంటుందన్న మాట. దీన్ని ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా నడిపి, లోటుపాట్లు పరిశీలించి ఆ తర్వాత రెగ్యులర్ షెడ్యూల్ ప్రకటించనున్నారు. అంతవరకూ ఇలా వన్ వే షెడ్యూల్ ఉంటుందని అధికారులు తెలిపారు. ఐదు రాష్ట్రాల మీదుగా సాగే ఈ ప్రయాణం ప్రయాణికులకు మంచి అనుభూతి పంచుతుందని రైల్వేశాఖ చెబుతోంది. ఈ రైలును ప్రధాని మోడీ ప్రారంభించిన దృశ్యాల వీడియోను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ లో షేర్ చేశారు.
-
ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్.. కీలక విషయాలపై చర్చ -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!














Click it and Unblock the Notifications