ఏపీలో షర్మిల ఎంట్రీ కోసం రాయబారం: కాంగ్రెస్కు మాస్ ఇమేజ్
YS Sharmila: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది.. ఏపీ. ఇంకో మూడు నెలల్లో నోటిఫికేషన్ వెలువడొచ్చు. లోక్సభతో పాటు ఏపీ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి ఫిబ్రవరి/మార్చి నెలల్లో షెడ్యూల్ విడుదల చేయడానికి ఈసీ కసరత్తు మొదలు పెట్టింది.
ఈ ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నియోజకవర్గ స్థాయిలో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. పార్టీ ఇన్ఛార్జీలను మార్చుతోంది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం టికెట్లను ఇవ్వడానికి నిరాకరిస్తోంది. వాళ్లు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న నియోజకవర్గాల్లో కొత్త వారికి ప్రాధాన్యతను ఇస్తోంది.

ఏపీలో దాదాపుగా ఉనికి కోల్పోయిన దశలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సైతం ఈ ఎన్నికలపై దృష్టి సారించింది. పొరుగునే ఉన్న కర్ణాటక, తెలంగాణల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో అదే ఊపును ఏపీలోనూ కొనసాగించాలని భావిస్తోంది. దీనికోసం వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది.
ఈ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి దించాలనే అభిప్రాయంతో ఉన్నట్లు ఇదివరకే వార్తలొచ్చిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలో ప్రియాంక గాంధీ నిర్వహించబోయే సభలో షర్మిలను చేర్చుకోవాలని భావిస్తోంది.
ఈ పరిస్థితుల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి.. బెంగళూరుకు వచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయన నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చినందుకు ఖర్గేకు అభినందనలు తెలియజేశారు రఘువీరా.

ఏపీ రాజకీయాలపై చర్చించారు. మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్నందున.. ఇక్కడి రాజకీయ స్థితిగతులు, పార్టీ గురించి ఖర్గే.. ఆయనను అడిగి తెలుసుకున్నారు. రాజధాని అమరావతి అంశం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన, ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి పూర్తి వివరాలను సేకరించారు.
ఎన్నికలు సమీపించే సమయానికి పీసీసీ అధ్యక్షుడి మార్పు అంశం కూడా ఖర్గే-రఘువీరా మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. గిడుగు రుద్రరాజు స్థానంలో మరో నేత పేరును పరిశీలించినట్లు సమాచారం. మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడిని కీలక బాధ్యతలను అప్పగించాల్సి ఉంటుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
వైఎస్ షర్మిలకు ఏపీ బాధ్యతలను అప్పగిస్తే ఎలా ఉంటుందనే విషయంపై వారిద్దరు చర్చించినట్లు చెబుతున్నారు. రఘువీరారెడ్డికి వైఎస్ కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉంది. దాన్ని ఉపయోగించుకుని కాంగ్రెస్ తరఫున ఏపీ ఇన్ఛార్జీగా నియమిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనే అంశంపై ఖర్గే ఆరా తీశారని అంటున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications