సిఎం చంద్రబాబుతో కాంగ్రెస్ నేత శైలజానాథ్ భేటీ:రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం
అమరావతి:ముఖ్యమంత్రి చంద్రబాబుతో కాంగ్రెస్ నేత శైలజానాథ్ భేటీ ఎపి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో శైలజానాథ్ సమావేశం అయిన సంగతి తెలిసిందే.
దాదాపు పావుగంట సేపు సీఎం చంద్రబాబుతో శైలజానాథ్ చర్చలు జరిపారు. అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్లపై సీఎంతో చర్చించానని తెలిపారు. ఎన్టీఆర్ వైద్యసేవా పథకం హైదరాబాద్లోని ఆస్పత్రుల్లో అమలు కావడంలేదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చానని శైలజానాథ్ చెప్పుకొచ్చారు.

మాజీ ఎమ్మెల్యేల విషయంలో సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్తో తాను ఏపీ సీఎం చంద్రబాబును కలిసినట్టు శైలజనాథ్ చెప్పారు. తాను కాంగ్రెస్ వాదినేనని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. రాజకీయ అంశాలు చంద్రబాబుతో తాను చర్చించలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే గత ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శైలజానాథ్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.
అయితే నిన్నే మాజీ కాంగ్రెస్ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్, నేడు మరో కాంగ్రెస్ నేత శైలజానాథ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా వరుసగా కాంగ్రెస్ నేతలు సిఎం చంద్రబాబును కలవడం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications