వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా: భారీగా కొత్త కేసులు - 5లక్షలకు చేరువగా - డిశ్చార్జీల్లోనూ రికార్డు - ఆ 4 జిల్లాల్లో..

|
Google Oneindia TeluguNews

కరోనా బాధిత రాష్ట్రాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతున్నది. వైద్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,794 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలకు చేరువగా 4.98లక్షలలకు పెరిగింది.

Recommended Video

COVID-19 In India : 90,633 కొత్త కేసులు, US, Brazil కలిపినా ఇండియాకు సమానం కాలేదు!! | Oneindi Telugu

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల 70 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో తొమ్మిది మంది, అనంతపూర్ 8, గూంటూరు 8, ప్రకాశం 8, కడపలో 7, తూర్పు గోదావరి 5, విశాఖపట్నం 5, పశ్చిమగోదావరి 5, కృష్ణా జిల్లాలో 4, కన్నూలు 4, నెల్లూరు 4, శ్రీకాకుళంలో 2, విజయనగరంలో ఒక మరణం చోటుచేసుకున్నాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4417కు పెరిగింది.

కామోన్మాదంతో కరోనా రోగిపై రేప్ - 108 అంబులెన్స్‌‌లో డ్రైవర్ అకృత్యం - చివరికి ఏమైందంటే..కామోన్మాదంతో కరోనా రోగిపై రేప్ - 108 అంబులెన్స్‌‌లో డ్రైవర్ అకృత్యం - చివరికి ఏమైందంటే..

covid-19 in ap: 10,794 new cases and 70 deaths registered in last 24 hours

కొత్త కేసుల పరంగా నాలుగు జిల్లాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. తూర్పు గోదావరిలో కొత్తగా 1244 కేసులు, పశ్చిమగోదావరిలో 1101, నెల్లూరు 1299, ప్రకాశం జిల్లాలో 1042 కొత్త కేసులు వచ్చాయి. చిత్తూరు(927), కడప(904)లోనూ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. అనంతపురంలో కొత్తగా 753, గుంటూరులో 703, కర్నూలులో 380, శ్రీకాకుళం 818, విశాఖపట్నం 573, విజనగరం జిల్లాలో 593 కొత్త కేసులు నమోదయ్యాయి.

పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబుకు కరోనా - ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరుకు - మెరుగైన చికిత్స కోసంపిఠాపురం ఎమ్మెల్యే దొరబాబుకు కరోనా - ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరుకు - మెరుగైన చికిత్స కోసం

మొత్తం కేసుల సంఖ్యతోపాటు యాక్టివ్ కేసుల పరంగానూ ఏపీ దేశంలో టాప్-2లో కొనసాగుతున్నది. ఆదివారం నాటికి రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 99,689గా ఉంది. ఇదిలా ఉంటే, రికవరీల్లోనూ ఇవాళ మెరుగైన గణాంకాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 11,915 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 72,573 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య శాఖ తెలిపింది. దీంతో ఏపీలో నిర్వహించిన మొత్తం టెస్టుల సంఖ్య 41.07లక్షలకు పెరిగింది.

English summary
andhra pradesh sees 10,794 new cases and 70 deaths on sunday. according to state health department bulletin, 11,915 patients were discharged in a single day and 72,573 samples have been tested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X