ఏపీలో కరోనా: మళ్లీ తిరగబెట్టిందా?-రికవరీలను మించి కొత్త కేసులు -ఆగని మరణాలు -2కోట్లకు చేరువగా టీకాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయ పరిస్థితులు మళ్లీ తిరగబెడుతున్నాయా? అనే అనుమానాలను రేకెత్తిస్తూ, గడిచిన నాలుగు రోజులుగా వ్యాధి నుంచి కోలుకుంటోన్నవారి సంఖ్య కంటే కొత్తగా పాజిటివ్ కు గురవుతోన్న వ్యక్తుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. మరణాలు కూడా ఎంతకూ అదుపులోకి రాకపోవడం కలవరపెడుతున్నది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మాత్రం వేగంగా కొనసాగుతున్నది. వివరాలివి..
నా ఫోన్కు ప్లాస్టర్ చుట్టుకున్నా -మోదీని తరిమేసేలా ఢిల్లీకి ఖేలా హోబే -ప్రధాని స్థాయిలో మమత సంచలనం
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గడిచిన 24 గంటల్లో మొత్తం 86,280 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 2,527 మంది పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,43,854కు పెరిగింది. కొత్త కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 515, చిత్తూరు 318, ప్రకాశం 303, పశ్చిమ గోదావరి 288, కృష్ణా 249, నెల్లూరు జిల్లాలో 206 కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా కాటుకు నిన్న ఒక్క రోజే 19 మంది బలయ్యారు. మొత్తంగా ఇప్పటిదాకా 13,197 మంది చనిపోయారు. తాజా మరణాల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురేసి, తూర్పు గోదావరి, ప్రకాశం, పశ్చిమ గోదావరిలో ఇద్దరు చొప్పున, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.
సాధారణంగా కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టే క్రమంలో, కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా నమోదవుతుంది. కానీ ఏపీలో మాత్రం గడిచిన నాలుగు రోజులుగా రికవరీల కంటే కొత్త కేసులే అధికంగా వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు 2,527కాగా, రికవరీలు 2,412గా ఉన్నాయి. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 19,06,718కి పెరిగింది. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసులు 23,939గా ఉన్నాయి. కాగా,
Recommended Video
వ్యాక్సినేషన్ ప్రక్రియలో దూసుకెళుతోన్న ఏపీలో ఇప్పటికే పంపిణీ చేసిన డోసుల సంఖ్య రెండు కోట్లకు చేరువైంది. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్లో మహిళలే ముందంజలో ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జూలై 17 నాటికి రాష్ట్రంలో మొత్తం 1.86 కోట్ల డోసుల టీకా వేయగా వీటిలో 1.01 కోట్ల డోసులు మహిళలేనని, జనాభా ప్రాతిపదికన ఏపీలోనే మహిళలకు అత్యధిక డోసులు వేసినట్టు తాజా గణాంకాలతో వెల్లడైంది.