వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా చెప్పిన తెల్లారే.. పవన్ కళ్యాణ్‌తో భేటీ: థర్డ్ ఫ్రంట్ కోసమూ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం భేటీ అయ్యారు. జాతీయస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా మూడో ఫ్రంట్ అంశంపై చర్చ జరిగినట్లుగా తెలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం భేటీ అయ్యారు. జాతీయస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా మూడో ఫ్రంట్ అంశంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన మోహన్ బాబుపవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన మోహన్ బాబు

గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టిడిపి -బిజెపికి మద్దతు పలికారు. ఆ పార్టీల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించారు. కేవలం ప్రత్యేక హోదా అంశం పైనే వారికి మద్దతు ఇచ్చినట్లు పలుమార్లు తెలిపారు.

2019లో కలిసి వెళ్లాలని..

2019లో కలిసి వెళ్లాలని..

ప్రత్యేక హోదాను బీజేపీ పక్కన పెట్టింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తే చాలని, హోదా అవసరం లేదని చెబుతోంది. ఈ పరిస్థితుల్లో హోదా సహా పలు సమస్యలపై నిలదీస్తున్న పవన్ కళ్యాణ్.. 2019 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్లాలని చూస్తున్నారు.

పవన్‌కు గద్దర్ ప్రశంస

పవన్‌కు గద్దర్ ప్రశంస

ఇప్పటికే ఆయన పలుమార్లు ఆ పార్టీ నాయకులను కలిశారు. ఇటీవల ప్రజా యుద్ధ నౌక గద్దర్ - పవన్ కళ్యాణ్ కలుసుకోవడం కూడా గమనార్హం. పవన్ మంచి వ్యక్తి అని, ఆయనతో రాజకీయాల్లో కలిసి పని చేసే అంశంపై ఆలోచిస్తామని వ్యాఖ్యానించారు.

ఆ మరుసటి రోజే..

ఆ మరుసటి రోజే..

తాజాగా, బుధవారం సీపీఎం నేత తమ్మినేని ఏచూరి కూడా పవన్ కళ్యాణ్‌తో జత కలిసే అంశంపై స్పందించారు. జనసేనతో కలిసి పని చేయడంపై రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన చెప్పిన మరుసటి రోజే పవన్ కళ్యాణ్ - తమ్మినేని భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

థర్డ్ ఫ్రంట్ కోసమూ చర్చలు

థర్డ్ ఫ్రంట్ కోసమూ చర్చలు

సీపీఎం జాతీయస్థాయిలో థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. పవన్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోను క్రేజ్ ఉంది. పైగా, గత ఎన్నికల్లో మోడీకి మద్దతివ్వడం ద్వారా జాతీయస్థాయిలో చర్చనీయాంశమయ్యారు. దీంతో సీపీఎంలు.. జనసేనతో పాటు ఇతర పార్టీలతో కలిసి థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని తెలుస్తోంది.

English summary
CPM Telangana leader Tammineni Sitaram on Thursday met Jana Sena chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X