హెలెన్: తుఫానుగా మారిన వాయుగుండం

తుఫాను ప్రభావం వల్ల బుధవారం రాత్రి నుంచి వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని, గురువారం రాత్రి ఒంగోలు - చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉంది. హెలెన్ తుఫాన్ నెల్లూరు జిల్లా కావలి వద్ద గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా తీరాన్ని దాటుతుందని ఐఎండి చెప్పింది.
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తుఫాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ గాలులు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో కూడా వీయవచ్చునని చెప్పారు.
హెలెన్ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు, పాండిచ్చేరి తీర ప్రాంతాల్లో ఉంటుంది. తుఫాను తీరం దాటే సమయంలో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి తీవ్రంగా ఉంటుందని అన్నారు. తుఫాను దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి సూచించారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications