బాత్రూంలో సెల్ కెమెరా పెట్టి విద్యార్థినుల నగ్న వీడియోలు: టీచర్కి దేహశుద్ది, అరెస్ట్
Recommended Video

అనంతపురం: పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఓ గురువు తన వక్రబుద్ధితో కటకటాలపాలైన ఘటనం అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన సంజీవరాయుడు బీఈడీ వరకు చదువుకున్నాడు.
మూడేళ్ల కిందట అనంతపురం వచ్చిన సంజీవరాయుడు.. మారుతినగర్లో 'లోటస్ అకాడమీ కోచింగ్' ఏర్పాటు చేసి వివిధ పోటీ పరీక్షలతో పాటు పాలిసెట్, ఏపీఆర్జేసీ, టీటీసీ, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాడు. సబ్జెక్టును బట్టి నెలకు రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నాడు.

హాస్టల్ ఏర్పాటు చేసి..
ఇల్లు, కోచింగ్ సెంటర్తోపాటు గ్రామీణ ప్రాంత విద్యార్థినుల కోసం హాస్టల్ కూడా ఒకే చోట నిర్వహిస్తున్నాడు సంజీవరాయుడు. ప్రస్తుతం అతని అకాడమీలో 75 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువమంది అమ్మాయిలే ఉన్నారు. కాగా, విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలన్న మంచి ఆలోచనతో అకాడమీ పెట్టిన సంజీవరాయుడి బుద్ధి వక్రమార్గంలో వెళ్లింది.

బాత్రూంలో సెల్ఫోన్ పెట్టి..
హాస్టల్లో ఉంటున్న అమ్మాయిలను నగ్న దృశ్యాలను చిత్రీకరించాలన్న దురాలోచన అతనిలో కలిగింది. ఈ క్రమంలో హాస్టల్లో విద్యార్థిను లందరికీ ఒకే బాత్రూం ఉండటంతో అవసరమైతే తన బాత్రూం కూడా వాడుకోవాలని శుక్రవారం ఉదయం చెప్పాడు. అయితే అప్పటికే తన బాత్రూంలో చెప్పుల బాక్సు (ఖాళీ అట్టపెట్టె) ఉంచి, దానికి రంధ్రం పెట్టి అక్కడ సెల్ఫోన్ వీడియో ఆన్ చేసి ఉంచాడు.

ఓ విద్యార్థినికి అనుమానం వచ్చి..
కాగా, స్నానానికి వెళ్లిన ఓ విద్యార్థిని ఆ అట్టపెట్టె అనుమానంగా కనిపించడంతో తెరిచి చూసింది. వీడియో రికార్డింగ్ను గుర్తించింది. జరిగిన విషయాన్ని తోటి విద్యార్థులకు తెలియజేసి, వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు.. సంజీవరాయుడును చితకబాదారు.

నిందితుడి అరెస్ట్
లోటస్ అకాడమీ కోచింగ్ సెంటర్లోని ఫర్నీచర్, ఫ్లెక్సీబోర్డులను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న 4వ పట్టణ ఎస్ఐ శ్రీరామ్ శ్రీనివాస్ ఘటనాస్థలానికి చేరుకొని.. నిందితున్ని అరెస్ట్ చేశారు. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications