కక్ష సాధింపు: తెలుగు రాష్ట్రాల 'ఓటుకు నోటు'పై దేవెగౌడ
బెంగళూరు: కక్ష సాధింపు కోసం రాజకీయ నాయకులు ఎంతకైనా తెగిస్తారని మాజీ ప్రధాని దేవెగౌడ వ్యాఖ్యానించారు. బెంగళూరులో శనివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్లో తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన ఓటుకు నోటు పైన అడిగిన ప్రశ్నకు స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. తెహెల్కా పత్రిక చాలమంది నాయకుల వ్యవహారాన్ని బయటపెట్టిందని, చివరకు ఏమైందని, ఏడాది క్రితం గోవా హోటల్లో లిఫ్ట్లో మహిళ పైన చేయి వేశారంట ఎడిటర్ను జైలు పాలు చేశారన్నారు.

ఉపాధి కుంభకోణం పేరిట హర్యానా నేత ఓం ప్రకాశ్ చౌతాలాను జైలుకు పంపారన్నారు. మన దేశంలో రాజకీయ నేతలు కక్ష సాధింపు కోసం ఎంతటికైనా తెగిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు.
బీహార్లో జేడీయూ, ఆర్జేడీ తదితర పార్టీల విలీనం నేపథ్యంలో బీజేపీకి గెలుపు అంత సులభం కాదన్నారు. మోడీ ఏడాది పాలన ప్రజల అంచనాలు అందుకోలేదని చెప్పారు. అయితే, ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా అవినీతి లేదని చెప్పారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications