కృష్ణా ప్రాజెక్టులకు నీరొస్తుంది: దేవినేని ఉమా, దురద్దేశ్యమంటూ బిజెవైఎం నేత
విజయవాడ/ న్యూఢిల్లీ: ఆగస్టు చివరి వరకు కృష్ణా ప్రాజెక్టులకు నీరు వస్తుందని ఆశిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆశాభావం వ్యక్తం చేశారు. పంటలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నామని ఆయన బుధవారం విజయవాడలో మీడియాతో చెప్పారు.
50 లక్షల ఎకరాల్లో పంటలు వేశారని, ఇప్పటివరకు మైనస్ 8 శాతం వర్షపాతం లోటు ఉందన్నారు. ఆగస్టు 15 నుంచి పట్టిసీమ ఎత్తిపోతల నుంచి 2,500 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలిస్తామని మంత్రి చెప్పారు. మంచినీటికి ఇబ్బంది లేకుండా నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయ ప్రణాళికలతో ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల హెక్టార్లలో పంటలు వేస్తున్నారని, ప్రస్తుతం ఉన్న నీటితో పంటలను కాపాడుతామని చెప్పారు.
ఇదిలావుంటే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్దన్రెడ్డి చెప్పారు. అయితే కొన్ని పార్టీలు ఉద్ధేశపూర్వకంగానే బీజేపీని విమర్శిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రి వెంకయ్య ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ యువమోర్చా సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రప్రభుత్వ కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకువెళతామని, అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఆయన చెప్పారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications