హై కోర్టు ఆదేశాల మేరకు అగ్రి గోల్డ్ భాధితులందరికి న్యాయం చేస్తాం: డీజీపీ
అగ్రిగోల్డ్ కుంభకోణంలో సీఐడీ విచారణలో కీలక పురోగతి. ఈ మేరకు డిజిపి మాట్లాడారు.ఎపీలో 19 లక్షల మంది అగ్రిగోల్డ్ డిపాజిటర్లు ఉన్నారని తెలిపారు.డిపాజిటర్లంతా ప్రొటెక్షన్ ఆఫ్ ఎపీ డిపాజిటర్స్ వెబ్సైట్లో
మంగళగిరి: అగ్రిగోల్డ్ కుంభకోణంలో సీఐడీ విచారణలో కీలక పురోగతి. ఈ మేరకు డిజిపి మాట్లాడారు. ఎపీలో 19 లక్షల మంది అగ్రిగోల్డ్ డిపాజిటర్లు ఉన్నారని తెలిపారు.
డిపాజిటర్లంతా ప్రొటెక్షన్ ఆఫ్ ఎపీ డిపాజిటర్స్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని గతంలో కోరామని చెప్పారు. 9. 9 లక్షల మంది ఆన్ లైన్ వెబ్ సైట్లో పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు.
ఇంకా 10 లక్షల మంది ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉందని, డిపాజిటర్ల ఖచ్చిత సమాచారం అందించాలని హైకోర్టు ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయి వెరిఫికేషన్ చేస్తున్నామన్నారు.
డిపాజిటర్ల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు ఈ నెల 12 నుంచి క్షేత్ర స్థాయి వెరిఫికేషన్ జరుగుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 13జిల్లాల్లో మండల కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ప్రత్యేక కౌంటర్ల వద్ద అగ్రిగోల్డ్ బాధితుల వివరాల నమోదు సహా ధృవపత్రాల తనిఖీ చేస్తామన్నారు. ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకున్న వారు కూడా తమ వద్ద ఉన్న ఆధారాలతో హాజరుకావాలన్నారు.
క్షేత్ర స్ధాయి విచారణ ఎప్పుడు ఎక్కడ నిర్వహించే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తాం అని డీజీపీ సాంబశివరావు అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు, మోసపోయిన మొత్తాన్ని తెలుపుతూ ఖచ్చిత వివరాలతో నివేదిక తయారు చేస్తామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తామన్నారు.