అయితే క్షమించండి.. ఎమ్మెల్యే ధర్మాన
ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పుపై అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలు, అమరావతి రైతులు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.. దీంతో ఆందోళన నిర్వహింస్తున్న రైతులు నాయకులకు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే అధికార వికేంద్రికరణను సమర్థిస్తూ... వ్యాఖ్యలు చేస్తున్న మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అమరావతి ఆందోళనపై చేసిన వ్యాఖ్యలను స్థానిక రైతుల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఓ రైతు నేరుగా ధర్మానకు ఫోన్ చేశారు. ఆయన మంత్రి మాటలు చాలా అంభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పాడు.
అయితే ధర్మాన కూడ అవేశం చెందకుండా సదరు రైతు చేసిన వ్యాఖ్యలపై సున్నితంగా సమాధానం చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు మీకు నచ్చలేదా... అయితే క్షమించండి అంటూ...చెప్పారు. దీంతో అమరావతికి వచ్చినప్పుడు కలుద్దాం అంటూ ఆయన ఫోన్ పెట్టారు. కాగా అమరావతిలో టీడీపీ నేతల డైరక్షన్లోనే అమరావతిలో ధర్నాలు జరుగుతున్నాయని ధర్మాన అన్నారు.

వార్తల్లో నిలబడేందుకు పెద్ద ఉద్యమం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ఇక ఇన్నాళ్లు ఉత్తరాంధ్రను ఎవరు పట్టించుకోవలేదని .. దీంతో అక్కడి ప్రజలు ఉద్యమం చేయాలా అని ప్రశ్నించారు. ఇప్పటికి ఉత్తరాంధ్రలో తాగడానికి కనీసం నీళ్లు కూడ లేని ప్రాంతాలు ఇంకా ఉన్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications