టీడీపీలో భగ్గుమన్న విభేదాలు..?
గెలిచి రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే టీడీపీ నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ నేతల మధ్య అధిపత్య పోరు మొదలైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి, సీనియర్ ఎమ్మెల్యేల మధ్య దూరం పెరిగిందనే వార్తలొస్తున్నాయి. జిల్లా మంత్రి , సీనియర్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర అధిపత్యపోరు నడుస్తోందని చర్చించుకుంటున్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్పై నాయకులు , పార్టీ క్యాడర్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. టీడీపీ సీనియర్ నాయకులెవ్వరూ కూడా ఆయనతో సమావేశం కావడానికి పెద్దగా సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది.
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వాసంశెట్టి సుభాష్ టికెట్ దక్కించుకోవడంతో పాటు, ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి కూడా అయ్యారు. దీంతో టీడీపీలో మొదటి నుంచి నాయకులు ఆయనపై అక్కస్సు వెళ్లగక్కుతున్నారు. మాజీ మంత్రి జవహర్, రెడ్డి అనంతలక్షి, జ్యోతుల నెహ్రూ ఇలా టీడీపీ నేతలందరూ కూడా వాసంశెట్టి సుభాష్ తీరుపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా అనంతపురం జిల్లాలో కూడా నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ.అస్మిత్ రెడ్డి , మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుల మధ్య అధిపత్యపోరు నడుస్తోన్నట్టు సమాచారం అందుతోంది.

తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ.అస్మిత్ రెడ్డి అభిమాన ఫేస్ బుక్ పేజ్లో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. గౌరవనీయులైన MS రాజు అన్నా మీరు దయచేసి తాడిపత్రి విషయాలలో జోక్యం చేసుకోకండి, మీరు గతంలో తాడిపత్రి SDPO పని చెసిన వారిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు గా అనిపిస్తుంది, తాడిపత్రి మేము పడిన బాధలు,అవమానాలు మాకు మాత్రమే తెలుసు దయచేసి మా తాడిపత్రి విషయంలో జోక్యం చేసుకోకండి, ఇది మా రిక్వెస్ట్ అన్నా, ఇది అందరు నాయకులకు కూడా వర్తిస్తుంది అని చెబుతూ జేసీ.అస్మిత్ రెడ్డి ఆర్మీ పేరు మీద ఉన్న ఫేస్ బుక్ పేజ్లో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, తాడిపత్రి నియోజకవర్గంలో కలుగజేసుకోవడం వల్లే వీరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్టు ఈ పోస్ట్ చూస్తే స్పష్టం అవుతోంది. అయితే దీనిపై అటు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ.అస్మిత్ రెడ్డి కానీ ఇటు మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు కానీ ఎవరూ స్పందించలేదు. గెలిచి రెండు నెలలు కాకుండానే ఇలా నేతల మధ్య పోరు మొదలుకావడంతో క్యాడర్ తలలు పట్టుకుంటున్నారు.
-
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట!












Click it and Unblock the Notifications