కాలం చెల్లిన నేతలు'' కేవీపీని ఘెరంగా అవమానించిన షర్మిల..?
ఏపీలో కాంగ్రెస్ పార్టీని వైఎస్ షర్మిల సర్వ నాశనం చేస్తోందని ఆ పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కూడా ఆమె మొండిగానే వ్యవహరిస్తున్నారని నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. పార్టీలో సీనియర్ నాయకులకు షర్మిల గౌరవం ఇవ్వడం లేదని, పార్టీలో దేని గురించి కూడా ఆమె ఎవరితోనూ చర్చించరని సీనియర్ నాయకులు వాపోతున్నారు. షర్మిల తన సొంత నిర్ణయాలను పార్టీపై రుద్దే ప్రయత్నం జరుగుతుందని ఆరోపిస్తున్నారు.
ఒంటెద్దు పోకడలతో పార్టీని ఇబ్బందికి గురి చేస్తోందని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ ఫ్యామిలీకి విధేయుడు కేవీపీ రామచంద్రరావు కూడా షర్మిల తీరుపై అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇదే సమయంలో కేవీపీ రామచంద్రరావును షర్మిల ఘోరంగా అవమానించారని సమాచారం. ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయని తెలుస్తోంది. ఇద్దరి మధ్య వివాదాలు ముదరడంతో కేవీపీ సైలెంట్ అయ్యారనే గుస గుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. షర్మిల ,కేవీపీల మధ్య వివాదం రావడానికి ఆమె సొంత అజెండాను అమలు చేయడమేనని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు.. తర్వాత కూడా.. షర్మిల సొంత అజెండాను అమలు చేయడాన్ని సీనియర్ నేతలు తప్పుపడుతున్నారు.

ముఖ్యంగా జగన్ను ఏకపక్షంగా విమర్శిస్తే.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరగదని కేవీపీ చెప్పినప్పటికీ ఆయన మాట వినకుండా జగన్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారంట. వ్యక్తిగత కక్షలకు కాంగ్రెస్ను వాడుకోవద్దని చెప్పడంతోనే షర్మిల కేవీపీని దూరం పెట్టినట్టు తెలుస్తోంది. కాలం చెల్లిన నేతలు.. కబుర్లు చెబుతున్నారు అంటూ.. పార్టీ సమావేశంలోనే కేవీపీపై విరుచుకుపడ్డారట షర్మిల.షర్మిల మాటలకు నొచ్చుకున్న కేవీపీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.
అధిష్టానంతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ వైఎస్ కుటుంబం మీద ఉన్న గౌరవంతో షర్మిల మీద ఎటువంటి ఫిర్యాదులు చేయకుండా కేవీపీ మౌనం పాటిస్తున్నారని ఆ పార్టీ నాయకలు చర్చించుకుంటున్నారు. వైఎస్కు నమ్మిన బంటుగా గుర్తింపు తెచ్చుకున్న కేవీపీపైనే షర్మిల ఇంత దారుణంగా మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ నేతల వాదన.ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా షర్మిల జగన్ను విమర్శించడం దారుణమని, ఎవరైనా అధికార పార్టీని టార్గెట్ చేయాలనుకుంటారు కానీ, విచిత్రంగా షర్మిల జగన్ను టార్గెట్ చేస్తున్నారని, దీనిపై ప్రశ్నిస్తే, పార్టీ నుంచి వెళ్లిపోయినా బాధలేదన్నట్టుగా ఆమె వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలామంది సీనియర్ నేతలు పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయనే చర్చ ఏపీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. మరి షర్మిల దూకుడుకు కాంగ్రెస్ అధిష్టానం ఎలా కళ్లెం వేస్తుందో చూడాలి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications