'కేసీఆర్ రుషి కాదు దొరకలేదు అంతే, మోడీ బాబును కాపాడొచ్చు'
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏమీ రుషి కాదని, చంద్రబాబు చేసిన పనే తనూ చేశారని, కానీ కేసీఆర్ దొరకలేదు అంతే అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ శనివారం అన్నారు.
టేపులు వాస్తవం అయితే చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గుజరాత్ అల్లర్లలో పాల్గొన్న వారిని, ఇష్రాత్ జహాన్ ఎదురుకాల్పుల నిందితులను ప్రధాని మోడీ కాపాడి ఉంటే చంద్రబాబుని కూడా కాపాడుతారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.
బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీని వీడటం దురదృష్టకరమన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి లేకపోతే వైసీపీ అధ్యక్షులు జగన్ ఎక్కడివాడు అన్నారు. వైసీపీ ఉనికి ఎక్కడిదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వల్లే వైయస్ రెండుసార్లు సీఎం అయ్యారన్నారు. కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నామని వైసీపీ గుర్తుంచుకోవాలన్నారు.