తిరుమలలో అన్నప్రసాదాలపై కీలక టీటీడీ నిర్ణయం
తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల ఆకలి తీర్చే అన్నపూర్ణ నిలయంగా భాసిల్లుతోంది. ప్రతిరోజూ దాదాపు మూడు లక్షల మందికి పైగా భక్తులు భోజనం స్వీకరిస్తున్నారు. టీటీడీ అన్న ప్రసాదం విభాగం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, అక్షయ, వకుళమాత అనే మూడు వంటశాలలు 24 గంటలు నిర్విరామంగా పనిచేస్తూ శ్రీవారి సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికీ అన్నప్రసాదాలను అందిస్తున్నాయి.
వైకుంఠం కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లు, డైనింగ్ హాల్ కు పరిమితమైన భోజన వసతి బయటి ప్రాంతాల్లో వేచి ఉన్నవారికీ కూడా అందించాలని టీటీడీ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా పంపిణీ చేస్తోంది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ప్రతి రోజూ 74,000, శ్రీ అక్షయ వంటశాలలో 1.48 లక్షల మంది, వకుళమాత వంటశాలలో రోజుకు 77,000 మంది భక్తులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని తయారు చేస్తున్నారు.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో గోధుమ రవ్వ ఉప్మా/ సూజి రవ్వ ఉప్మా/ సేమియా ఉప్మా/ పొంగలి, చట్ని, సాంబార్, మధ్యాహ్నం స్వీట్ పొంగల్, అన్నం, కర్రీ, చట్నీ, వడ, సాంబార్, రసం, మజ్జిగ. సాయంత్రం స్వీట్ పొంగల్, అన్నం, కర్రీ, చట్నీ, వడ, సాంబార్, రసం, మజ్జిగ వడ్డిస్తోన్నారు.
అక్షయ వంటశాలలో గోధుమ రవ్వ ఉప్మా/ సొజ్జి రవ్వ ఉప్మా, పొంగలి, సాంబారన్నం, పెరుగన్నం, టమోట రైస్, సుండలు, పాలు, టీ, కాఫీ తయారు చేస్తారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే పర్వదినాలు, ముఖ్యమైన రోజుల్లో మజ్జిగ, బాదం పాలు, బిస్కెట్లు, జ్యూస్ ప్యాకెట్లను కూడా ఇక్కడ నుండి భక్తుల కోసం పంపిణీ చేస్తారు.
వకుళమాత వంటశాలలో యాత్రికుల వసతి సముదాయం-2, 4, 5లోని భోజనశాలలు, బయట ప్రాంతాల్లోని సీఆర్ఎఓ, యాత్రికుల వసతి సముదాయం-1, రామ్ భగిచా అతిథి గృహం, అంజనాద్రి నిలయం కాటేజీల వద్ద ఉన్న భక్తులకు పంపింణీ చేసేందుకు సాబారన్నం, పెరుగన్నం, ఉప్మా తయారు చేస్తారు. దాదాపు 1,000 అన్న ప్రసాద విభాగం సిబ్బంది, శ్రీవారి సేవకుల సహకారంతో భక్తులకు ఎప్పటికప్పుడు అంతరాయం లేకుండా భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. పీఏసీల్లో ఉండే భక్తులకు అన్నప్రసాదాలను అందించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి.












Click it and Unblock the Notifications