మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి... ఐదుగురు మృతి
దేశ వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ తెల్లవారుజాము నుంచే ప్రజలు శైవ క్షేత్రాలకు క్యూ కడుతున్నారు. ప్రత్యేక పూజలు చేస్తూ శివయ్యని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలోనే శివ నామస్మరణతో ఆలయాలు అన్నీ మార్మోగుతున్నాయి. అయితే మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి చెందడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద ఈ విషాద ఘటన జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా నదిలో స్నానానికి వెళ్లారు ఐదుగురు యువకులు. అయితే లోతు ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో వారంతా మునిగిపోయినట్టుగా భావిస్తున్నారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఐదుగురు మృతదేహలు లభ్యమయ్యాయి.

మృతి చెందిన యువకులు తాడిపూడి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. యువకులను తిరుమల శెట్టి పవన్, పడాల దుర్గాప్రసాద్, అనీసెట్టి పవన్, గర్రె ఆకాష్, పడాల సాయిగా తెలిపారు. నదిలో లోతుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించక మునిగిపోయారని అనుకుంటున్నారు. ఒకరికి ఒకరు రక్షించుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఐదుగురు యువకులు గల్లంతు అయినట్టుగా అంచనా వేస్తున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications