Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చేపమందు: సాగిందిలా, భారీ జనం, తోపులాట(పిక్చర్స్)

హైదరాబాద్: ఆదివారంనాడు చేప ప్రసాదం కోసం ప్రజలు భారీ సంఖ్యలో రావడంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిటకిటలాడింది. ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు బత్తిన సోదరులు పంపిణీ చేసే చేపప్రసాదాన్ని ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా పాల్గొన్నారు. చేప ప్రసాదం పంపిణీ కోసం వచ్చిన ప్రజలు, వారి సహాయకులతో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం కిక్కిరిసిపోయింది.

మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన ఉబ్బసం వ్యాధిగ్రస్తులు చేప ప్రసాదం కోసం లైన్లలో వేచివున్నారు. తమవంతు వచ్చిన వారు చేప ప్రసాదం స్వీకరించి అక్కడ్నుంచి తమ స్వస్థలాలకు పయనమయ్యారు. కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా, మధ్యమ మండలం డిసిపి కమలాసన్‌రెడ్డి సౌకర్యాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిహెచ్ఎంసి, విద్యుత్, జలమండలి, డిఎంహెచ్‌ఓ, పోలీస్, అగ్నిమాపకశాఖ అధికారులతో ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.

మత్స్య శాఖ చేపమందు పంపిణీ కోసం లక్ష కొరమీను చేపపిల్లలను అందచేసింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 32 కౌంటర్లలో ఒక్కొక్క చేప పిల్లను రూ.15లకు ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు విక్రయించారు. ఆదివారం సాయంత్రం 9.00 గంటలకు 20 వేల చేప పిల్లలను అమ్మినట్లు మత్స్యశాఖ సహాయ సంచాలకులు వేణుగోపాల్ తెలిపారు. ప్రజలు బస చేసేందుకు మైదానంలో ప్రత్యేక షెడ్డులను ఏర్పాటు చేశారు.

చేప ప్రసాదం

చేప ప్రసాదం

చేప ప్రసాదం కోసం భారీగా జనం రావడంతో కొంత తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వారిని క్యూలైన్లలో నడిచే విధంగా చూశారు. తోపులాటలో కిందపడిపోయిన ఓ మహిళ.

తోపులాట

తోపులాట

ఆదివారంనాడు చేప ప్రసాదం కోసం ప్రజలు భారీ సంఖ్యలో రావడంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిటకిటలాడింది.

తోపులాట

తోపులాట

ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు బత్తిన సోదరులు పంపిణీ చేసే చేపప్రసాదాన్ని ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభించారు.

భారీ జనం, తోపులాట

భారీ జనం, తోపులాట

మొదట బత్తిని కుటుంబ సభ్యులు వారి పూర్వీకులకు పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా పాల్గొన్నారు.

భారీ జనం, తోపులాట

భారీ జనం, తోపులాట

చేప ప్రసాదం పంపిణీ కోసం వచ్చిన ప్రజలు, వారి సహాయకులతో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం కిక్కిరిసిపోయింది.

భారీ జనం, తోపులాట

భారీ జనం, తోపులాట

మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన ఉబ్బసం వ్యాధిగ్రస్తులు చేప ప్రసాదం కోసం లైన్లలో వేచివున్నారు.

చేప ప్రసాదం

చేప ప్రసాదం

తమవంతు వచ్చిన వారు చేప ప్రసాదం స్వీకరించి అక్కడ్నుంచి తమ స్వస్థలాలకు పయనమయ్యారు. చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.

చేప ప్రసాదం

చేప ప్రసాదం

కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా, మధ్యమ మండలం డిసిపి కమలాసన్‌రెడ్డి సౌకర్యాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కిందపడి పోయిన మహిళకు నీళ్లు తాగిస్తూ..

కిందపడి పోయిన మహిళకు నీళ్లు తాగిస్తూ..

జిహెచ్ఎంసి, విద్యుత్, జలమండలి, డిఎంహెచ్‌ఓ, పోలీస్, అగ్నిమాపకశాఖ అధికారులతో ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.

చేప ప్రసాదం

చేప ప్రసాదం

మత్స్య శాఖ చేపమందు పంపిణీ కోసం లక్ష కొరమీను చేపపిల్లలను అందచేసింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 32 కౌంటర్లలో ఒక్కొక్క చేప పిల్లను రూ.15లకు ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు విక్రయించారు

చేప ప్రసాదం

చేప ప్రసాదం

ఆదివారం సాయంత్రం 9.00 గంటలకు 20 వేల చేప పిల్లలను అమ్మినట్లు మత్స్యశాఖ సహాయ సంచాలకులు వేణుగోపాల్ తెలిపారు.

చేప ప్రసాదం

చేప ప్రసాదం

ప్రజలు బస చేసేందుకు మైదానంలో ప్రత్యేక షెడ్డులను ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం స్వీకరించేందుకు దేశ రాజధాని ఢిల్లీతోపాటు రాజస్థాన్, పంజాబ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన ఆస్తమా వ్యాధిగ్రస్తులు శుక్రవారం రాత్రే నగరానికి చేరుకుని ఈ షెడ్ల కింద సేదతీరారు.

చేప ప్రసాదం

చేప ప్రసాదం

ఆదివారం సాయంత్రం 5.30 నిమిషాలకు ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం సోమవారం 5.30 గంటల వరకు కొనసాగునుందని బత్తిన హరినాథ్‌గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం అందని వారికి నగరంలోని కవాడిగూడలోని తమ నివాసంలో మంగళవారం చేప ప్రసాదం పంపిణీ చేస్తామని తెలిపారు.

ఢిల్లీతోపాటు రాజస్థాన్, పంజాబ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన ఆస్తమా వ్యాధిగ్రస్తులు శుక్రవారం రాత్రే నగరానికి చేరుకుని ఈ షెడ్ల కింద సేదతీరారు. వీరి కోసం పలు స్వచ్ఛంద సంస్థలు భోజన సదుపాయాలతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించారు. చేప ప్రసాదం పంపిణీకి వేదికగా నిలిచిన ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం మొదటి రోజు 500మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లను మధ్య మండలం డిసిపి కమలాసన్‌రెడ్డి, ఏసిపి జైపాల్ ఆధ్వర్యంలో బందోబస్తు కొనసాగింది. కాగా, భారీగా వ్యాధిగ్రస్థులు రావడంతో కొంత తోపులాట జరిగింది. పోలీసులు సరిగా స్పందించడంతో చేప ప్రసాదం పంపిణీ సాఫీగా సాగింది.

ఆదివారం సాయంత్రం 5.30 నిమిషాలకు ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం సోమవారం 5.30 గంటల వరకు కొనసాగునుందని బత్తిన హరినాథ్‌గౌడ్ తెలిపారు. ఈ పంపిణీలో లక్షలాది మంది ఆస్తమా రోగులు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. నిరుడు 2 లక్షల మందికి పంపిణీ చేశామన్నారు. ఈ ఏడాది మరో లక్షకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. చేప ప్రసాదం అందని వారికి నగరంలోని కవాడిగూడలోని తమ నివాసంలో మంగళవారం చేప ప్రసాదం పంపిణీ చేస్తామని తెలిపారు. కాగా, చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టిన కొద్ది సమయానికి బత్తిని హరినాథ్‌గౌడ్‌కు స్వల్ప అస్వస్థత చేకూరింది. దీంతో ఆయన కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+