దేశంలో తొలి మహిళా వైద్యురాలు ఎవరో తెలుసా తెలుసా..?
ప్రాచీన కాలంలో మహిళలు వైద్యం చేసేవారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కానీ వారికి "డాక్టర్" అనే బిరుదును అధికారికంగా ఇచ్చారా లేదా అనే విషయంలో స్పష్టమైన రికార్డులు లేవు.ఆధునిక వైద్య విధానాలు పశ్చిమ దేశాల నుంచి వ్యాపించడంతో, అక్కడి విద్యావ్యవస్థలో మహిళలకు వైద్య విద్య అందుబాటులోకి వచ్చిన తర్వాతే "డాక్టర్" అనే పదానికి ప్రస్తుత అర్థం స్థిరపడింది. అయినప్పటికీ, కొందరు ప్రముఖ మహిళా వైద్యులను మనం గుర్తు చేసుకోవచ్చు.
భారతదేశంలో ఆధునిక వైద్య విద్యను అభ్యసించిన మొదటి మహిళగా ఆనందీబాయి జోషి గుర్తింపు పొందారు. ఆమె భారతదేశపు మొదటి మహిళా వైద్యురాలిగా చరిత్ర సృష్టించింది. ఒక కాలంలో స్త్రీలకు విద్య అంటే దూరం అయినప్పుడు, ఆనందీబాయి తన కలలను సాకారం చేసుకుని, లక్షలాది మంది మహిళలకు స్ఫూర్తి నిచ్చింది.భారతదేశంలో మెడిసిన్ ప్రాక్టీస్ చేసిన తొలి మహిళా డాక్టర్గా రుఖ్మాబాయి రౌత్ ప్రసిద్ధులు.రుఖ్మాబాయి రౌత్త ఇంగ్లాండ్లో వైద్యం చదివి, భారతదేశంలో మొట్టమొదటి మహిళా వైద్యురాలిగా పేరుగాంచారు.

ఆమె 35 సంవత్సరాల పాటు రాజ్కోట్లోని మహిళా ఆసుపత్రిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా పనిచేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా మత్తు వైద్యురాలుగా రూపాబాయి ఫర్దూంజీ గుర్తింపు పొందారు.ప్రపంచ తొలి మహిళా డాక్టర్ అనే ప్రశ్నకు సమాధానం కంటే, మహిళలు వైద్యరంగంలో చేసిన కృషిని మనం గుర్తించడం ముఖ్యం. ఆనందీబాయి జోషి, రుఖ్మాబాయి రౌత్, రూపాబాయి ఫర్దూంజీ వంటి మహిళలు తమ కాలంలోనే అద్భుతమైన విజయాలు సాధించారు. వారి కృషి వల్లనే ఇలా మహిళలు వైద్యరంగంలో అన్ని రకాల పదవులను చేపట్టగలుగుతున్నారు.












Click it and Unblock the Notifications