జీజీహెచ్ ఘటనపై మంత్రి కామినేని సీరియస్
బతికున్న శిశువు చనిపోయినట్లు ధ్రువీకరించిన ఘటనలో గుంటూరు జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) వైద్యులపై మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డ చనిపోయాడని చెప్పిన ఆ వైద్యులు ఎవరిని ఆయన ఫోన్లోనే ప్రశ్నించారు.
శిశువు కదులుతున్నాడని తల్లిదండ్రులు చెప్పినా వైద్యులు పట్టించుకోకపోవడంపై మంత్రి మండిపడ్డారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే నివేదిక పంపాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ను ఆదేశించారు.
గుంటూరు జిల్లాలోని దాసరిపాలెంనకు చెందిన దుర్గా భవానీ(23) కాన్పు నిమిత్తం మంగళవారం ఉదయం జీజీహెచ్కు వచ్చింది. ఆరున్నర గంటల సమయంలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పసిబిడ్డను పరీక్షించిన వైద్యులు, పురిటిలోనే బాబు చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది పసిబిడ్డను తండ్రికి ఇచ్చారు.
దీంతో తండ్రి జగన్నాధం శిశువును సొంతూరికి తీసుకెళ్లి పూడ్చుతుండగా బాబులో కదలిక కనపడింది. ఆ తర్వాత ఏడవటం మొదలు పెట్టాడు. కాస్తంత ఆలస్యం చేసి ఉంటే వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం పోయేది. ఇదే విషయాన్ని అతడు వైద్యుల దృష్టికి తీసుకు వెళ్లడంతో చికిత్స నిమిత్తం శిశువును వెంటనే ఐసీయూకు తరలించారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications