జగన్ ఇంట్లో తిరుగుబాటు, వైఎస్ కొడుకని ఇష్టం: డొక్కా

Dokka Manikya Vara Prasad
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి మద్దతు పలికితే మొదట ఆయన ఇంట్లోనే తిరుగుబాటు వస్తుందని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ బుధవారం అన్నారు. కిరణ్ పైన ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే.

వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ అంశాల పైనా స్పందించారు. తెలంగాణ ఉద్యమాన్ని తాను గౌరవిస్తున్నానన్నారు. జగన్ మోడీని పొగిడిన అంశంపై ప్రశ్నించగా... బిజెపికి మద్దతు పలికితే జగన్ ఇంట్లోనే మొదట తిరుగుబాటు వస్తుందన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా జగన్ అంటే ఇష్టమని, అంతకుమించి ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్నారు.

ప్రస్తుతం ఉన్న సమస్యలు చక్కదిద్దాలంటే స్వర్గీయ నందమూరి తారక రామారావో లేక వైయస్ రాజశేఖర రెడ్డో రావాలన్నారు. సీమాంధ్ర ప్రజల ఆకాంక్షను కేంద్రం పరిశీలిస్తోందన్నారు. హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తానని, పార్టీకి అనుకూలంగా ఉంటానని ఆయన తెలిపారు.

కిరణ్ కుమార్ రెడ్డి చుట్టు భజనపరులు చేరారన్నారు. ఆయన పొగడ్తలకు పొంగిపోతున్నారని ఎద్దేవా చేశారు. తాను ముక్కుసూటిగా మాట్లాడుతాను కాబట్టి తనను పట్టించుకోరన్నారు. సర్వేలను నమ్ముకుంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి వస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+