పోలీసుల వలయంలో కిర్లంపూడి, అడుగడుగునా చెక్పోస్టులు
కాపు రిజర్వేషన్ పోరాట సమితి ముద్రగడ పద్మనాభం పాదయాత్రల హెచ్చరికల నేపథ్యంలో కిర్లంపూడిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కిర్లంపూడిలో 2 వేల మంది పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు
కిర్లంపూడి: కాపు రిజర్వేషన్ పోరాట సమితి ముద్రగడ పద్మనాభం పాదయాత్రల హెచ్చరికల నేపథ్యంలో కిర్లంపూడిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కిర్లంపూడిలో 2 వేల మంది పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు.
కాపులను బిసిల్లో చేర్చాలనే డిమాండ్తో ముద్రగడ పద్మనాభం తలపెట్టిన చలో అమరావతి పాదయాత్రకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.అయితే పాదయాత్రను నిర్వహించి తీరుతామని ముద్రగడ ప్రకటించారు.
దీంతో తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకుసిద్దంగా ఉన్నారు. సుమారు 6 వేల మంది పోలీసులను మోహరించారు. కిర్లంపూడిలోనే 2 వేల మంది పహరా కాస్తున్నారు.
ముద్రగడ అనుచరులపై పోలీసుల నిఘా కొనసాగుతోంది. తూర్పుగోదావరితోపాటు, గుంటూరుజిల్లాలో కూడ పోలీసులు తీవ్ర ఆంక్షలను పెట్టారు.
గుర్తింపుకార్డు ఉంటేనే కిర్లంపూడి గ్రామంలోకి అనుమతిస్తున్నారు.ఎక్కడికక్కడ నిర్భందాలు, తనిఖీలను నిర్వహిస్తున్నారు పోలీసులు. ఈ నెల 26వ, తేదిన ముద్రగడ పాదయాత్రను నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

పోలీసుల వలయంలో కిర్లంపూడి
ఈ నెల 26వ, తేది నుండి రిజర్వేషన్ల సాధన కోసం పాదయాత్రను నిర్వహిస్తామని ముద్రగడ ప్రకటించిన నేపథ్యంలో కిర్లంపూడిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. ఈ గ్రామంలోకి వచ్చే అన్ని రహదారులను పోలీసులు దిగ్భందించారు. ముద్రగడ ఇంటి ముందు పోలీసులు సిసికెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాను ఆయన ఇంటిపై తిప్పుడూ అక్కడి పరిస్థితిని రికార్డు చేస్తున్నారు.
Recommended Video


పాదయాత్ర చేసి తీరుతాం
ఈ నెల 26వ, తేదిన పాదయాత్ర చేసి తీరుతామని కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు ప్రకటించారు. పాదయాత్ర చేయకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుపడడంపై వారు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాపులు నక్సలైట్లా అంటూ వారు ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. ప్రభుత్వం తమ తీరును మార్చుకోవాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు కోరుతున్నారు.

కాపునేతలపై నిఘా
ఈ నెల 26వ, తేదిన నిర్వహించే పాదయాత్రను భగ్నం చేసేందుకు పోలీసులు వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారు. పాదయాత్రలో కాపు యువత పెద్ద ఎత్తున పాల్గొనకుండా ఇప్పటికే కౌన్సిలింగ్ నిర్వహించారు.అంతేకాదు ఆయా గ్రామాల్లో మఫ్టీల్లో కాపు యువతపై నిఘాను ఏర్పాటుచేశారు. అంతేకాదు ముద్రగడ అనుచరుల కదలికలపై కూడ నిఘాను పెట్టారు.

దారిపొడవునా చెక్పోస్టులు
కిర్లంపూడికి వెళ్ళే దారితో పాటు గుంటూరుకు వెళ్ళే రహదారిలో చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు 30 సెక్షన్ను అమలు చేస్తున్నారు. కిర్లంపూడిలో 144 సెక్షన్ ను విధించారు. రహదారి పొడవునా చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ రెండు జిల్లాల్లో కలిపి సుమారు 95 చెక్పోస్టులను ఏర్పాటు చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications