శోభా నాగిరెడ్డి వారసులెవరు?: గెలుస్తామన్న భూమా
ఎన్నికల అనంతరం శోభాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆమెను గెలిచినట్లు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉప ఎన్నిక జరుపుతారు. ఈ క్రమంలో శోభా నాగిరెడ్డి వారసులు ఎవరు అనే చర్చ సాగుతోంది.
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పదిమందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో శోభా నాగిరెడ్డికి మద్దతుగా అనుచరులైన భూమా బ్రహ్మానంద రెడ్డి, సింగం వెంకటేశ్వర రెడ్డి, దస్తగిరి రెడ్డి స్వతంత్రులుగా నామినేషన్లు దాఖలు చేశారు. బ్రహ్మానంద రెడ్డి తన నామినేషన్ను ఉపసంహరించుకోగా, వెంకటేశ్వ రెడ్డి, దస్తగిరి రెడ్డి బరిలో నిలిచారు. ప్రస్తుతం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు ఇస్తుందా లేక శోభా నాగిరెడ్డిని గెలిపిస్తుందా చూడాలి.
శోభా గెలుస్తారు: భూమా నాగిరెడ్డి
తన భార్య శోభా నాగిరెడ్డి మృతి చెందినప్పటికీ.. ఆమె ప్రజల గుండెల్లో ఉందని, ఆమెను గెలిపిస్తారని భూమా నాగిరెడ్డి అన్నారు. శోభా ఒక లక్ష మెజార్టీతో గెలుపొందటం ఖాయమన్నారు. ఉప ఎన్నికల్లోను తాము అదే మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.