వైసీపీ ముఖ్య నేతపై ఈడీ గురి - ఆట మొదలు..!!
ఏపీలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయం..నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఎంవీవీ పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. భూ ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంవీవీతో పాటుగా ఆయన సన్నిహితుల నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం పరిధిలో నమోదు చేసిన కేసులు ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది.
ఈడీ సోదాలు
మాజీ ఎంపీ ఎంవీవీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. సత్యానారాయణ నివాసంతో పాటుగా మధురవాడలోని కార్యాలయంలోనూ సోదాలు చేస్తున్నారు. ఎంవీవీతో పాటుగా ఆడిటర్ వెంకటేశ్వరరావు, గద్దె బ్రహ్మాజీ నివాసాలు, కార్యాలయాల్లోనూ ఈడీ సోదాలను నిర్వహిస్తుంది. మొత్తం ఐదు చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తుంది. ఎంవీవీ సత్యనారాయణపై మోసం, కుట్ర, ఫోర్జరీ వంటి ఆరోపణలతో కేసు నమోదయింది. వీటిల్లో ఇప్పటికే ఎంవీవీ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.

ఆడిటర్ తో సహా
ఎంవీవీకి ఆడిటర్ గా వ్యవహరిస్తున్న జీవీ నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. హయగ్రీవా ఇన్ఫ్రాటెక్, కన్స్ట్రక్షన్స్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మధురవాడ భూమి కొనుగోలు కేసులో ఈడీ సోదాలు చేస్తుందని తెలుస్తోంది. దాదాపుగా రూ.12.5 కోట్ల లావాదేవీల వ్యవహారంలో ఎంవీవీపై ఈడీ కేసు నమోదు అయింది. ఎంవీవీ పలు తెలుగు సినిమాలను నిర్మించారు. గీతాంజలి, అభినేత్రి, నీవెవరు వంటి సినిమాలను ఎంవీవీ నిర్మించారు. కాగా, 2006-2008 మధ్య జరిగిన లావాదేవీలపై ఈడీ కేసు నమోదు అయింది.
భూ కేసుల్లో
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బిల్డర్. ఫోర్జరీ చేసి విక్రయ పత్రాలను కూడా తయారు చేశారని ఆరోపణలున్నాయి. హయగ్రీవ కనస్ట్రక్షన్స్ విశాఖ పరిధిలో వృద్ధాశ్రమం, అనాధాశ్రమాన్ని నిర్మించడానికి 2008లో ప్రభుత్వం నుంచి 12.51 ఎకరాలను అప్పట్లో మార్కెట్ రేటుకు కొనుగోలు చేసింది. ఈ స్థలానికి సంబంధించి తరువాతి కాలంలో అనేక ఫిర్యాదులు వచ్చాయి. కాగా, 2019లో విశాఖ నుంచి ఎంవీవీ వైసీపీ ఎంపీగా గెలిచారు. తాజా ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈడీ సోదాల గురించి అధికారికంగా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఏం గుర్తించారనేది వెల్లడించాల్సి ఉంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications