ఏపిలో కాయ్ రాజా కాయ్ , లక్షలతో ఎన్నికలపై బెట్టింగ్ లు
డబ్బు,డబ్బు,డబ్బు దేనికైనా డబ్బే కావాలి ,ఇదే మనుష్యులను ఎక్కడికైనా తీసుకెళుతుంది..ఎందాకానైనా లాక్కెళుతుంది. ఇక ఈజీ మనీ అయితే ఇంకా మంచిది , ఎక్కడ ఈజీ మనీ లభిస్తుందో అక్కడ వాలిపోతారు..లేనివి క్రియోట్ చేసి వ్యాపారం చేస్తారు..తాజాగా ఇలాంటీ వారికి ఓ వైపు ఎన్నికలు మరోవైపు క్రికెట్ లభించింది..వీటిపై బెట్టింగ్ ల మీద బెట్టింగ్ లు పెడుతున్నారు. ఈనేపథ్యంలోనే ఆ పార్టీ గెలుస్తుంది ,లేదు ఈ పార్టీ గెలుస్తోంది అంటూ పందేం కూడిన ప్రచారం మొదలైంది. దీంతో రూ లక్ష నుండి అయిదు లక్షల వరకు బెట్టింగ్ లు కాస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మొదలైన ఎన్నికల బెట్టింగ్,
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బెట్టింగ్ జోరు మొదలైపోయింది. ఎక్కడ చూసినా గెలిచేదెవరు? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? కాబోయే సీఎం ఎవరు..? అనే చర్చలే నడుస్తున్నాయి. ఇదే అదనుగా బెట్టింగ్ రాయుళ్లు పందేలకు తెరలేపారు. .. అభ్యర్థుల గెలుపోటములపై ఇప్పటికే లక్షల్లో పందేలు కాస్తున్నారు. కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై భారీగా బెట్టింగ్ సాగుతోంది. లక్ష రుపాయాలకు అయిదు లక్షలంటూ బెట్టింగ్ నడుస్తోంది.
గతంలో పశ్చిమ గోదావరి జిల్లాల్లో బెట్టింగ్
గతంలో పశ్చిమ గోదావరి జిల్లా నుండి పోటి చేసిన చిరంజీవి పై చాలమంది బెట్టింగ్ లు కాశారు. ఆయన పార్టీ అధికారంలోకి వస్తుందంటూ లక్షల రుపాయలు బెట్టింగ్ లు పెట్టారు. దీంతో అలా పెట్టిన వారంత బికారులుగా మారిన సంఘటనలు ఉన్నాయి.పాలకొల్లుకు చెందిన పలువురు వ్యాపారలు పందెం కాసి రోడ్డున పడ్డారు. నర్సాపురానికి చెందిన ఆక్వా వ్యాపారి , భీమవరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ హీరోపై పందెం కాసి నష్టపోయారు. . బెట్టింగ్ల్లో డబ్బు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడ ఉన్నారు
ఇప్పుడు అదే వరస
జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయడంతో.. ఇప్పుడు అందరి దృష్టి ఈ స్థానంపైనే ఉంది. భీమవరంలో జనసేన, టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు ఉంది. దీంతో అక్కడ ఎవరు గెలుస్తారంటూ పందేలు కాసుకుంటున్నారు. ఇప్పటికో కోట్లు చేతులు మారాయని చర్చ నడుస్తోంది. ఎన్నికలకు రెండు వారాల ముందే పరిస్థితి ఇలా ఉంటే.. మున్ముందు ఇంకా భారీ ఎత్తున పందేలు సాగవచ్చని అంచనా వేస్తున్నారు.