ఏపీ ఫలితాల ఎఫెక్ట్ : టీడీపీలో కొత్త టెన్షన్: మహానాడు ఊసేలేదు..జరిగేనా...!
Recommended Video
మహానాడు. ప్రతీ ఏటా పార్టీ వేడుకగా నిర్వహించే టీడీపీ పండుగ. ప్రతీ సంవత్సరం మూడు రోజుల పాటు మహానాడు నిర్వహిస్తారు. ఈ సారి మాత్రం మహానాడు పైన ఎన్నికల ఎఫెక్ట్ పడింది. పార్టీ కార్యక్రమాలు నిర్వహించటానికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా.. మహానాడు నిర్వహణ పైన ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయాలు ప్రకటించలేదు. దీంతో..మహానాడు మూడు రోజులు నిర్వహిస్తారా..లేక ఒక్కరోజుకే పరిమితం అవుతారా అనేది తేలాల్సి ఉంది.
మహానాడు కమిటీలు ఏవీ..
ప్రతీ ఏడాది టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జన్మదనం సందర్బంగా మూడు రోజులు పాటు మహానాడు పండుగ నిర్వహిస్తారు. పార్టీ పండగుగా అట్టహాసంగా..పార్టీ నేతలు అందరూ ఇందులో భాగస్వాములవుతారు. కానీ, ఈ ఏడాది మాత్రం టీడీపీ మహానాడు పైన ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ పడినట్లు కనిపిస్తోంది. సాధారణంగా ప్రతీ ఏడాది మే 27,28,29 తేదీల్లో మహానాడు నిర్వహిస్తారు. ఈ సారి మే23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రానున్నాయి. పైకి ధీమాగా కనిపిస్తున్నా.. టీడీపీలో ఎన్నికల ఫలితాల టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది.

దీంతో..మహానాడు నిర్వహణ పైన ఇప్పటి వరకు అధికారికంగా సమీక్షలు..కమిటీల ఏర్పాటు..నిర్వహణ పైన చర్చలు జరగలేదని పార్టీ నేతలే చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు..ఆతరువాత ఫలితాల ఆధారంగా చోటు చేసుకొనే రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే మహానాడు నిర్వహణ పైనా తుది నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. ఫలితాలు ఎలా ఉన్నా మహానాడు నిర్వహణ పార్టీ పండుగ అని ..దీని పైన ఫలితాల ఎఫెక్ట్ అని చెప్పటం సరి కాదనే వాదన పార్టీ సీనియర్లలో ఉంది.
ఒక్క రోజుకే పరిమితమా...
ప్రతీ ఏటా మూడు రోజుల పాటు నిర్వహించే మహానాడు ఈ సారి ఎన్నికల ఫలితాల కారణంగా ఒక్క రోజుకే పరిమితం చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మే 28న ఒక్క రోజు మాత్రమే మహానాడు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని పార్టీలో ముఖ్య నేతలు చెబుతున్నారు. మే 23న ఫలితాలు అనుకూలంగా వస్తే ఈనెల25న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందంటున్నారు. ఒక వేళ..వ్యతిరేకంగా వస్తే..రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయాల పైన దృష్టి పెట్టాల్సి ఉంటుందని చెబుతన్నారు.

ఇక, జాతీయ స్థాయిలోనూ చంద్రబాబు కీలకంగా వ్యవహరిస్తుండటంతో ఏపీ ఫలితాలతో పాటుగ లోక్సభ ఫలితాలకు అనుగుణంగా చోటు చేసుకొనే రాజకీయ పరిణామాల్లో చంద్రబాబు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని..దీని కోసమే మహానాడు నిర్వహణ పైన నిర్ణయం ఇంకా తీసుకోలదేని పార్టీ నేతలు కొందరు సమర్ధించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో..ఫలితాల ఎఫెక్ట్ టీడీపీ నేతలను ఎంతగా టెన్షన్ పెడుతుందో..దీని ద్వారా స్పష్టం అవుతోంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications